బంగ్లాదేశ్ ఎన్నికల్లో అనూహ్య మలుపు: కనీవినీ ఎరుగని భారీ మెజారిటీ సాధించిన పార్టీ
బంగ్లాదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. గురువారం జరిగిన ఆ దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) ఘన విజయాన్ని సాధించింది. ఈ తెల్లవారు జామున 4:30 గంటలకు అందిన సమాచారం ప్రకారం.. ఆ పార్టీ మొత్తం 209 నియోజకవర్గాల్లో జెండా పాతింది. ఆ పార్టీ అధినేత తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
2024 నాటి ప్రజాందోళనల తర్వాత బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. ప్రజలు కొత్త పార్లమెంట్ ను ఎన్నుకోవడానికి, రాజ్యాంగంలో ప్రతిపాదిత మార్పులు (జూలై చార్టర్)పై తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 కోట్ల మందికి పైగా ఓటర్లు ఓటువేశారు.

బీఎన్పీ నాయకుడు, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి తారిక్ రెహమాన్ రెండు నియోజకవర్గాలు ఢాకా-17, బోగురా-6 స్థానాల నుండి పోటీ చేసి ఘన విజయం సాధించారు. బీఎన్పీ మెజారిటీ సీట్లను సాధించినట్ల ప్రకటించిన వెంటనే బీఎన్పీలో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఢాకా, చిట్టాగాంగ్ సహా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు వేడుకలను జరుపుకొన్నారు.
భారీ విజయాన్ని అందించినందుకు బీఎన్పీ అగ్ర నాయకత్వం.. దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసింది. విజయోత్సవాలు జరపవద్దని, బదులుగా శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొనాలని, మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాను స్మరించుకోవాలని కార్యకర్తలకు సూచించింది. సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని, ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.
కాగా జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని కూటమి 68 స్థానాలను గెలుచుకుంది. నేషనల్ సిటిజన్ పార్టీ ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మిగిలిన స్థానాల్లో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నానికల్లా 299 స్థానాలకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
జమాత్-ఎ-ఇస్లామీ నేతృత్వంలోని 11 పక్షాల కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 70 సీట్ల లోపు మాత్రమే పరిమితం అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024 ఆగస్టు నాటి విద్యార్థుల ఆందోళన నుంచి ఉద్భవించిన యువ నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ (NCP) కూటమికి చుక్కెదురైంది. ప్రస్తుతానికి ఒక స్థానంలో మాత్రమే గెలిచింది. మరి కొన్ని చోట్ల ఆధిక్యతలో కొనసాగుతోంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications