బ్రిక్స్ విస్తరణ- మోదీ మాటంటే మాటే..!!
జొహాన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్బర్గ్లో ఏర్పాటైన బ్రిక్స్ సమ్మిట్ ఓపెన్ ప్లీనరీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. బ్రిక్స్ను భవిష్యత్ అవసరాలకు సంసిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇందులో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
ప్రస్తుతం బ్రిక్స్లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు సభ్యత్వం ఉంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా, రష్యా తరఫున ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెయ్ లావ్రొవ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధినేత గ్ఝి జిన్పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా- ఈ అత్యున్నత సదస్సుకు హాజరయ్యారు.

వారందరూ పాల్గొన్న ఈ ఓపెన్ ప్లీనరీలో మోదీ- బ్రిక్స్ విస్తరణకు హామీ ఇచ్చారు. దీన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి బ్రిక్స్ను విస్తరించాల్సి వస్తే.. తాము మద్దతు ఇస్తామని అన్నారు.
దీనికి అనుగుణంగా బ్రిక్స్ను విస్తరించారు. కొత్త దేశాలకు సభ్యత్వాన్ని ఇచ్చారు. కొత్తగా మరో ఆరు దేశాలు బ్రిక్స్లో జాయిన్ కానున్నాయి. వచ్చే ఏడాది జరిగే బ్రిక్స్ సమ్మిట్ నాటికి ఆ దేశాలకు సభ్యత్వం లభించనుంది. బ్రిక్స్ విస్తరణకు మద్దతు ఇస్తామని మోదీ ప్రకటించిన మరుసటి రోజే- కొత్త దేశాలకు సభ్యత్వాన్ని కల్పించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇక కొత్తగా బ్రిక్స్లో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యత్వం లభించింది. తమకు సభ్యత్వాన్ని కల్పించడం పట్ల ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఇప్పుడున్న సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడిగా పురోగమించడానికి అవకాశం లభించిందని వ్యాఖ్యానించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications