Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌లో ఐసిస్ ఉగ్ర దాడులు: బ్రిటన్ నిఘా వర్గాల హెచ్చరిక

న్యూఢిల్లీ: మిడిల్-ఈస్ట్ టెర్రరిస్ట్ గ్రూపు ఉగ్రవాద సంస్ధ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) భారతదేశంలో ఉగ్రవాద దాడులు చేసే ప్రమాదం ఉందని బ్రిటన్ నిఘా వర్గాలు భారత్‌ను హెచ్చరించాయి.

వెంటనే వాటికి అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాదంపై భారత్-బ్రిటన్‌ల మధ్య జనవరి 15, 16 తేదీల్లో జరిగిన ఇండో-యూకే కౌంటర్ టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూపు సమావేశంలో భారత అధికారులకు బ్రిటిష్ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు.

Britain warns India of possible terror attack by ISIS

ఉగ్రవాదుల్లో మంచివాళ్లు, చెడ్డవాళ్లు అని ఎవరూ ఉండరన్న విషయాన్ని పాకిస్ధాన్‌కు చెప్పాలని బ్రిటిష్ అధికారులను భారత్ కోరింది. ఇటీవల పెషావర్ స్కూలుపై కాల్పులు జరిగిన సంఘటనే అందుకు నిదర్శమని, ఇకనైనా పాక్ ఆ విషయాన్ని గుర్తించాలని సూచించింది.

గత కొన్నేళ్లుగా పాకిస్ధాన్ ఉగ్రవాదులకు నర్సరీగా ఎందుకు ఉందో అడగాలని తెలిపింది. బ్రిటన్‌లో లష్కరే ఈ తోయిబా కదలికలపై అడగ్గా... ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసే ప్రమాదం ఉందని బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరించాయని అధికారులు తెలిపారు.

ఇటీవల కాలంలో పాకిస్ధాన్‌కు చెంది టెర్రరిస్ట్ గ్రూపుల కంటే కూడా సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్ నుంచే పెను ప్రమాదం సంభవించి ఉందని బ్రిటన్ వారి కదలికపై నిఘా పెట్టిందన్నారు. ఇది ఇలా ఉంటే పశ్చిమ బంగలో నలుగురు అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిని ఢాకాలోని జత్రాబరిస, ఖిల్‌ఖేట్ ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+