2017కల్లా మరో టైటానిక్: ఈ నౌక మంచుకొండను ఢీకొంటుంది కానీ
బీజింగ్: టైటానిక్ షిప్ లాంటి మరో భారీ షిప్ను చైనాకు చెందిన ఓ కంపెనీ తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని 2017 వరకు తీసుకు వస్తామని చెబుతోంది. మంచు కొండను ఢీకొని అట్లాంటిక్ మహా సముద్రంలో టైటినిక్ షిప్ మునిగింది.
ఈ సంఘటన 1912వ సంవత్సరంలో జరిగింది. ఇది అత్యంత పెద్ద షిప్. దీనికి ప్రతిరూపంగా మరో షిప్ తెస్తున్నట్లు చైనాకు చెందిన కంపెనీ చెప్పింది.
ఇందు కోసం 161 మిలియన్ డాలర్లతో టైటానిక్ ప్రతిరూపాన్ని అభివృద్ధి చేస్తోంది. 2017 అక్టోబర్ నెల కల్లా దీనిని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని సిచుయాన్కు చెందిన చైనా సంస్థ తెలిపింది.
నాడు 1912 ఏప్రిల్ 15వ తేదీన టైటానిక్ న్యూఫౌండ్ లాండుకు దక్షిణ ప్రాంతంలో మంచు పర్వతాన్ని ఢీకొని మునిగిపోయింది. దీనిని ప్రజలకు తెలియజేసేందుకు దీనిని నిర్మిస్తున్నారు. దీని కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
మంచు కొండను ఈ నౌక ఈ నౌక ఎలాంటి ప్రమాదం జరగకుండా ఢీకొంటుంది. టైటానిక్మునిగే సమయంలో ఏర్పడిన పూర్తి ధ్వని, కాంతి ప్రభావాలను సందర్శకులకు కలిగిస్తుంది.