Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ వేడుకలో ఒబామా: కౌంటర్‌గా పాక్ వేడుకల్లో చైనా అధ్యక్షుడు

న్యూఢిల్లీ: భారత దేశంతో అమెరికా సంబంధాలకు కౌంటర్‌గా పాకిస్తాన్, చైనాలు మరింత దగ్గరవుతున్నాయి! భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో పాకిస్తాన్, చైనా దేశాలు ఈ పర్యటన పైన విభిన్నంగా స్పందించాయి. భారత్, యూఎస్ సంబంధాల పైన చైనా విమర్శలు కూడా గుప్పించింది.

ఇప్పుడు చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ పాకిస్తాన్ మిలటరీ పరేడ్ వేడుకల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. మార్చి 23వ తేదీన పాకిస్తాన్ వార్షిక మిలటరీ పరేడ్ ఉంది. దీనికి జీ జింగ్‌పింగ్ రానున్నారు. ఈ కార్యక్రమం ఇస్లామాబాదులో జరగనుంది. చివరి మిలటరీ పరేడ్ మార్చి 23, 2008లో జరిగింది. అప్పుడు పర్వేజ్ ముషరాఫ్ అధ్యక్షుడిగా ఉన్నారు. భారత్, అమెరికా సంబంధాలకు పోటీగా పాక్ వేడుకల్లో చైనా అధ్యక్షుడు పాల్గొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కాగా, భారత్‌తో అమెరికా సంబంధాలు బలపడుతుండడంపై చైనా అభద్రతకు గురికావలసిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్న విషయం తెలిసిందే. ఆసియా దేశాల ఎదుగుదలను అడ్డుకోవడానికి పశ్చిమ దేశాలు పన్నిన ఉచ్చులో చిక్కుకుని భారత్‌ అమెరికాకు మద్దతు ఇవ్వవద్దంటూ.. చైనా అధికార పత్రిక చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

అసలు చైనా ఇటువంటి అనుమానాలను ఎందుకు పెట్టుకుంటుందో అర్థం కావడంలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుని ఇరుదేశాల ప్రజల ఆకాంక్షలను సుసంపన్నం చేయాలన్నది తన అభిమతమన్నారు. వేరొకరికి నష్టం వాటిల్లకుండా కలిసి ముందడుగు వేయాలనే తాను కోరుకుంటానన్నారు.

Chinese President Xi Jinping Could be Chief Guest at Pakistan's Military Parade Next Month

ఈ క్రమంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీతో తన చర్చలు కొనసాగాయని ఒబామా చెప్పారు. భారత్‌కు అమెరికా దగ్గరకావడానికి అనేక అంశాలు దోహదపడ్డాయన్నారు. ముఖ్యంగా రెండూ ప్రజాస్వామిక దేశాలన్నారు. ఇరుదేశాల ప్రజల ఆకాంక్షలు ఒకేతీరుగా ఉంటాయని, అమెరికా ప్రజలు ఆలోచించిన విధంగానే భారత ప్రజలు కూడా ఆలోచిస్తారన్నారు. చైనా ఈ రీతిలో స్పందించదన్నారు.

శాంతియుత వాతావరణంలో చైనా అభివృద్ధి చెందితే తాము స్వాగతిస్తామన్నారు. అంతేకానీ ఎదుటి వారి ప్రయోజనాలను దెబ్బతీస్తూ తాము ఎదుగుతామంటే అంగీకరించబోమని తాను అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వియత్నాం, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలను బెదిరించి లొంగదీసుకోవడం మాత్రం కుదరదన్నారు.

అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలన్నారు. రష్యా, అమెరికాల మధ్య యుద్ధం వచ్చే అవకాశంలేదన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య నేపథ్యంలో అమెరికా విధించిన ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందన్నారు.

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ యుద్ధం జరిగే ప్రసక్తే లేదన్నారు. రష్యా- అమెరికాల మధ్య యుద్ధం అమెరికాకు ప్రపంచానికి కూడా మంచిది కాదన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగానే రష్యాపై ఆంక్షలు విధించాల్సి వచ్చిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+