దాడులతో లంకలో సంక్షోభం : ఎమర్జెన్సీ విధించిన అధ్యక్షుడు
కొలంబో : వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంకలో భయానక వాతావరణం నెలకొంది. ఆదివారం 8 చోట్ల, సోమవారం మరో చోట బాంబు పేలడంతో అక్కడ పరిస్థితి భీతావాహంగా మారింది. సోమవారం బాంబులను నిర్వీర్యం చేయడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. 2009 తర్వాత భారీ దాడి శ్రీలంక ఆదివారం ఎదుర్కొంది. 290 మంది మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వీరిలో ఎనిమిది మంది భారతీయులు ఉన్నారు. దీంతో శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడబోతోన్నాయి. ఈ నేపథ్యంలో తమకు ఆపన్నహస్తం అందించాలని ప్రపంచదేశాలను శ్రీలకం ప్రభుత్వం కోరుతోంది.

ప్రజా భద్రతను దృష్టిలో పెట్టుకునే ...
లంకలో బాంబు పేలుళ్లలో ఆ దేశ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజా భద్రత దృష్ట్యా దేశంలో ఎమర్జెన్సీ విధించినట్టు మీడియాకు తెలిపింది. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ ప్రకటించారు. లంకలో పేలుళ్లకు పాల్పడింది నేషల్ తౌహిత్ జమాతే అని అక్కడి మీడియాలో ప్రచారం సాగింది. దేశంలో మారణహోమం సృష్టించే అవకాశం ఉన్నదని నిఘా వర్గాలు ప్రభుత్వానికి తెలియజేశామని చెప్తున్నాయి. కానీ అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.
విదేశీ ఉగ్రవాదుల హస్తం ?
దేశంలో దాడి దృష్ట్యా ఇతర దేశాల సాయం కోరినట్టు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన పేర్కొన్నారు. శ్రీలంకలోని ఉగ్రవాదులకు విదేశాలకు చెందిన ఉగ్రవాదులు సాయం చేసి ఉంటారని ఆయన భావిస్తున్నారు. దాడిలో చనిపోయిన కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీనిచ్చారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియల కోసం నగదు అందజేశారు. గాయపడ్డ వారికి కూడా పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications