కారులో బాంబు పేలుడు: పుతిన్ మార్గదర్శి అలెగ్జాండర్ కూతురు మృతి
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు, ప్రభావవంతమైన రష్యన్ తత్వవేత్త అలెగ్జాండర్ డుగిన్ కుమార్తె దర్యా దుగినా శనివారం మాస్కో ప్రాంతంలో దుర్మరణం పాలయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు పేలడంతో మరణించినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టీఏఎస్ఎస్ వెల్లడించింది.
అలెగ్జాండర్ లక్ష్యం కానీ.. ఆయన కుమార్తె బలైంది
దర్యా దుగినా తన కారులో ఇంటికి బయల్దేరగా.. మొజస్కౌయి హైవేపై బోల్షియా అనే గ్రామం వద్దకు రాగానే కారులో భారీ పేలుడు సంభవించింది. దాడిలో ధ్వంసమైన కారు.. అలెగ్జాండర్ది కావడం గమనార్హం. ఆయనే అసలైన లక్ష్యమని రష్యా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, అలెగ్జాండర్ వేరే కారులో వెళ్లడంతో ఆయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
భారీ ధ్వంసం.. కారు పేలుడు చిత్రాలు వైరల్
కారు పేలుడు పరిణామాల నుంచి చిత్రాలు శనివారం రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రహదారి పక్కన వాహనం మంటల్లో ఉన్నట్లు, చుట్టుపక్కల ప్రాంతాలలో ధ్వంసమైన కారు భాగాలు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్పై దాడుల్లో పుతిన్కు మార్గదర్శి అలెగ్జాండర్
ఉక్రెయిన్పై రష్యా దాడికి అలెగ్జాండర్ ప్రధాన సూత్రధారి అనే వాదన కూడా కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ యుద్ధం విషయంలో పుతిన్ ను అలెగ్జాండర్ బాగా ప్రభావితం చేశారు. అలెగ్జాండర్ కుమార్తె దర్యా రచయిత. ఆమె పూర్తిగా సాంప్రదాయ వాది.
ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన అమెరికా ట్రెజరీస్ ఆఫీస్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ ఆంక్షల జాబితాలో దర్యా కూడా ఉన్నారు. ఆమె ఉక్రెయిన్ పై రాసిన వ్యాసం కారణంగానే ఈ జాబితాలో చేర్చారు. కాగా, డుగినా కుమార్తె 1992లో జన్మించింది. టాస్ ప్రకారం.. మాస్కో స్టేట్ యూనివర్శిటీలో ఫిలాసఫీని అభ్యసించింది.