భూమిపై ఉన్న అంతరిక్ష శ్మశానవాటిక ఎక్కడుందో తెలుసా...?
ఈ భూమండలంపై మానవుడు చేరుకోవడం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్రదేశం ఒకటుంది. ఇక్కడికి మనిషి చేరుకోవాలంటే వేలకిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే పాయింట్ నిమో. ఈ పాయింట్ నిమో అంటార్కింటికా నుంచి ఉత్తరాణ 3000 మైళ్లు.. న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ల దూరంలో ఫసిఫిక్ మహాసముద్రంలో గుర్తించబడింది. భూమి పైభాగాన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోని నివసించే వ్యోమగాములే పాయింట్ నిమోకు దగ్గరగా ఉండే జీవులుగా చెప్పొచ్చు. ఈ పాయింట్ ఐఎస్ఎస్కు సుమారు 400 కిలోమీటర్ల ఎగువన ఉంది.
అంతేకాదు, ఈ ప్రదేశం అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో, కాలం చెల్లిన ఉపగ్రహాలు ఇతర అంతరిక్ష వ్యర్థాలను శాస్త్రవేత్తలు ఈ పాయింట్ సమీపంలో కూలిపోయేలా ప్రణాళికలు వేసుకుంటారు. దీంతోపాటు 2030 నాటికి ఐఎస్ఎస్ కాలం కూడా ముగిసిపోనుండడంతో ఐఎస్ఎస్ కూడా సముద్రగర్భంలో పాయింట్ నిమో వద్దే కలిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేసే ఈ ప్రదేశాన్ని అంతరిక్ష వ్యర్థాల శ్మశానవాటికగా పిలుస్తారు.

మానవాళికి పెను సవాలు...:
పాయింట్ నెమోని ఓషియానిక్ పోల్ ఆఫ్ అక్సెసిబిలిటీ లేదా 'దక్షిణ పసిఫిక్ మహాసముద్రం జనావాసాలు లేని ప్రాంతం'గా చెబుతుంటారు. నిజానికి, 1992లో కెనడాకు చెందిన రష్యన్ ఇంజనీర్ అయిన హ్ర్వోజే లుకటేలా దాని ఖచ్చితమైన కోఆర్డినేట్లను ముందుగా గుర్తించాడు. అలాగే 2019 అధ్యయనం ప్రకారం..ఈ మారుమూల ప్రాంతంలో 1971 నుంచి 263కి పైగా అంతరిక్ష శిథిలాలు కూలిపోయినట్లు లెక్కగట్టారు. అంతేకాదు, నాసాకు చెందిన స్కైలాబ్, రష్యా మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలు కూడా ఇక్కడే కూల్చివేయబడ్డాయి. ఈ ప్రాంతం మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ, ఈ సముద్రం అడుగుభాగంలో అంతరిక్ష వ్యర్థాలతో పాటు మైక్రో ప్లాస్టిక్ కణాలు కనుగొనబడ్డాయంటే ప్లాస్టిక్ వ్యర్థాల మోతాదు మానవాళికి భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లను విసరబోతుందోనని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు పర్యావరణ వనరులను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. మరీ ఈ అంతరిక్ష శ్మశానవాటిక మానవ మనుగడపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications