ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం, బోయింగ్ 737లో సిబ్బంది సహా 157 మంది
ఆడిస్ అబాబా: ఇథియోపియా ఎయిర్ లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 149 మంది ప్రయాణీకులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తం 157 మంది ఉన్నారు. ఆడిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఈ సంఘటన ఆదివారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) గం.8.44 నిం.లకు చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఇథియోపియా ప్రధానమంత్రి కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లోను స్పందించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

ఇథియోపియా ఎయిర్ లైన్స్ బోయింగ్ 737 కూలిన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణీకుల కుటుంబాలకు ప్రధాని తరఫున, ప్రభుత్వం తరఫున, ఇథియోపియా ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విమానం నైరోబీ వెళ్తుండగా దుర్ఘటన జరిగినట్లుగా పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications