మరో సునామీ.. పరుగులు పెట్టిన జనం.. తీరా అది అబద్ధం
జకర్తా : మొన్నటి సునామీ సృష్టించిన బీభత్సం నుంచి ఇండోనేసియా ప్రజలు ఇంకా తేరుకోలేదు. అది మిగిల్చిన విషాదపు మరకలు మాయకముందే మరో వార్త వారిలో భయం పుట్టించింది. మరో సునామీ విరుచుకుపడుతోందంటూ రెక్కలు తొడిగిన అబద్ధపు సమాచారం వారిని ఉరుకులు పరుగులు పెట్టించింది.
మరో సునామీ వస్తోందనే వదంతులు షికారు చేయడంతో సుమర్ గ్రామంలో కలకలం రేగింది. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. స్థానికులతో పాటు సహాయక చర్యల కోసం వచ్చిన సిబ్బంది సైతం ఎత్తైన ప్రాంతాల వైపు ఉరుకులు పెట్టారు. చివరకు అదంతా అబద్ధమేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం నాటి ప్రకృతి ప్రళయానికి ఇండోనేసియా కకావికలమైంది. చాలా ప్రాంతాలు బురదమయంగా మారాయి. సునామీ సంభవించినప్పుడు 222 మందిగా ఉన్న మృతుల సంఖ్య మంగళవారం నాటికి 429కి చేరింది.












Click it and Unblock the Notifications