మరో సునామీ.. పరుగులు పెట్టిన జనం.. తీరా అది అబద్ధం
జకర్తా : మొన్నటి సునామీ సృష్టించిన బీభత్సం నుంచి ఇండోనేసియా ప్రజలు ఇంకా తేరుకోలేదు. అది మిగిల్చిన విషాదపు మరకలు మాయకముందే మరో వార్త వారిలో భయం పుట్టించింది. మరో సునామీ విరుచుకుపడుతోందంటూ రెక్కలు తొడిగిన అబద్ధపు సమాచారం వారిని ఉరుకులు పరుగులు పెట్టించింది.
మరో సునామీ వస్తోందనే వదంతులు షికారు చేయడంతో సుమర్ గ్రామంలో కలకలం రేగింది. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. స్థానికులతో పాటు సహాయక చర్యల కోసం వచ్చిన సిబ్బంది సైతం ఎత్తైన ప్రాంతాల వైపు ఉరుకులు పెట్టారు. చివరకు అదంతా అబద్ధమేనని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం నాటి ప్రకృతి ప్రళయానికి ఇండోనేసియా కకావికలమైంది. చాలా ప్రాంతాలు బురదమయంగా మారాయి. సునామీ సంభవించినప్పుడు 222 మందిగా ఉన్న మృతుల సంఖ్య మంగళవారం నాటికి 429కి చేరింది.
More From
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications