పాక్ ఫోక్ సింగర్ రేష్మ కన్నుమూత, నెలనుండి కోమాలో

ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత కొద్ది రోజులుగా రేష్మా కోమాలో ఉన్నారు. రేష్మ 1947లో రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో ఓ బంజారా కుటుంబంలో జన్మించారు.
కొన్నాళ్లకు ఆమె కరాచీలో స్థిర పడింది. రేష్మకి ఓ కోడుకు, ఓ కూతురు ఉన్నారు. రేష్మ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు జియో టివిలో వార్తలు వచ్చాయి.
రేష్మకు పన్నెండేళ్లు ఉన్నప్పుడు షహబాజ్ కలందర్ విగ్రహం వద్ద పాడిన పాట విన్న ఓ టెలివిజన్, రేడియో నిర్మాత ఆమెకు లాల్ మేరీతో అవకాశమిచ్చారు. అది సూపర్ హిట్ అయింది. రేష్మ పాకిస్తాన్లో ప్రముఖ ఫోక్ సింగర్లలో ఒకరు.












Click it and Unblock the Notifications