గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ రికార్డు
కాలిఫోర్నియా: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 199 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. అత్యధిక వేతనం పొందుతున్న గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పిచాయ్ ఘనత పొందారు.
గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ సుందర్కు 199 మిలియన్ డాలర్ల విలువ చేసే 273,328 క్లాస్ సి గూగుల్ స్టాక్ యూనిట్లను ఇచ్చింది. వీటి విలువ రూపాయల్లో సుమారు 1,356 కోట్లు ఉంటుంది. దీంతో అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న అమెరికా కంపెనీల ఎగ్జిక్యూటివ్స్లో పిచాయ్ అగ్రస్థానంలో నిలిచారు.

భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ 2015 ఆగస్టులో గూగుల్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చిన షేర్లతో అల్ఫాబెట్లో ఆయన షేర్ల విలువ సుమారు 650 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4,430 కోట్లు)చేరింది.
అల్ఫాబెట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరట్కు కూడా 38.3 మిలియన్ డాలర్ల విలువ చేసే స్టాక్స్ లభించాయి. గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ అధిపతి డియానే గ్రీనేకు కూడా 42.8మిలియన్ డాలర్ల స్టాక్స్ను కట్టబెట్టారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications