ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిని అదృశ్యం, గాలింపు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారత విద్యార్థిని కనిపించకుండా పోయింది. 30 ఏళస్ల నటాషా నారంగ్ అనే భారత విద్యార్థిని అక్టోబర్ 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. చివరిసారి ఆమె మౌబ్రేవోలో దర్శనమిచ్చింది. ఆమె జాడను కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
నారంగ్ టాస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేస్తోంది. ఒడ్డున ఆమెకు చెందిన కొన్ని వస్తులు కనిపించడంతో పోలీసులు గురువారంనాడు తామర్ నదిలో గాలింపు చేపట్టారు. అయితే, ఆమె జాడ తెలియలేదు.
పంజాబ్కు చెందిన నారంగ్ పిహెచ్డి చేయడానికి ఆస్ట్రేలియా వచ్చింది. తన భర్త సందీప్తో కలిసి ఆమె నిరుడు నవంబర్లో టాస్మానియాకు చేరుకుంది. ఆమె అదృశ్యంలో భర్త పాత్ర ఉండవచ్చునని నారంగ్ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
చదువుకు సంబంధించిన ఒత్తిడి వల్లనే ఆమె కనిపించకుండా పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు సంబంధించిన సమాచారం అందించడానికి పలువురు ప్రయత్నిస్తున్నారు. కానీ ఫలితం కనిపించడం లేదు.