ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ ప్లాంట్పై మిస్సైల్ దాడి!
మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు భయందోళనలను కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ(ద్రవీకృత సహజ వాయువు) ఉత్పత్తి కేంద్రమైన ఖతార్లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ లక్ష్యంగా ఇరాన్ బుధవారం అర్ధరాత్రి క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ ప్రయోగించిన 5 క్షిపణులలో నాలుగింటిని ఖతార్ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగలిగినప్పటికీ.. ఓ క్షిపణి నేరుగా ప్లాంట్ను తాకడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 295 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్లాంట్ ప్రపంచ గ్యాస్ అవసరాలలో 20 శాతం తీరుస్తుంది. కాబట్టి ఈ దాడి అంతర్జాతీయ ఇంధన భద్రతపై కోలుకోలేని దెబ్బతీసింది.
ఖతార్ అల్టిమేటం
ఈ దాడిని ఖతార్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇది తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ.. ఇరాన్ మిలిటరీ అధికారులను 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ ఆదేశించింది. ఈ పరిణామం దౌత్యపరంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్కు చెందిన 'సౌత్ పార్స్' గ్యాస్ క్షేత్రంపై చేసిన దాడికి ప్రతీకారంగానే.. ఇరాన్ మిత్రదేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గ్లోబల్ మార్కెట్పై ప్రభావం
దాడి జరిగిన గంటల వ్యవధిలోనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకే రోజులో 8 శాతం పెరిగి బ్యారెల్కు 111.90 డాలర్లకు చేరుకుంది. హోర్ముజ్ జలసంధిలో ఇప్పటికే ఉన్న అస్థిరతకు తోడు, తాజా దాడితో ఆసియా, యూరప్ దేశాలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయే ముప్పు ఏర్పడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి, పారిశ్రామిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
QatarEnergy’s Ras Laffan Industrial City to the north of Doha, Qatar's main site for the production of liquefied natural gas and gas-to-liquid, as well as the largest export terminal for LNG in the world, has been heavily targeted tonight by ballistic missiles fired by Iran.… pic.twitter.com/Ax9WaOjDAK
— OSINTdefender (@sentdefender) March 18, 2026
పొరుగు దేశాలపై దాడుల విస్తరణ
ఇరాన్ తన దాడులను కేవలం ఖతార్కే పరిమితం చేయకుండా పొరుగు దేశాలకు కూడా విస్తరించింది. అబుదాబిలోని హబ్ఘన్ గ్యాస్ ప్లాంట్ సమీపంలో క్షిపణి శకలాలు పడటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేశారు. అదే విధంగా సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంత గ్యాస్ ప్లాంట్పై జరిగిన డ్రోన్ దాడిని అక్కడి సైన్యం అడ్డుకుంది. రియాద్ రిఫైనరీ సమీపంలో కూడా క్షిపణి శకలాలు పడటం గల్ఫ్ ప్రాంతం మొత్తంఒక అగ్నిగుండంగా మారిందనడానికి నిదర్శనం.
ప్రస్తుత పరిస్థితి ఇలా..
ప్రస్తుతానికి రాస్ లఫాన్లోని మంటలు అదుపులోకి వచ్చాయని, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని ఖతార్ ఎనర్జీ సంస్థ ప్రకటించినప్పటికీ.. ప్లాంట్ తిరిగి ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. ప్లాంట్కు జరిగిన నష్టం అపారంగా ఉండటంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ కోలుకోవడానికి సమయం పట్టవచ్చు. ప్రపంచ దేశాలు ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలు జరపాలని కోరుతున్నాయి.
-
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
Lockdown: లాక్ డౌన్ ఎక్కడంటే ?- పార్లమెంట్ లో తేల్చేసిన ఆర్థికమంత్రి..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications