హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడంపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా తన వైఖరిని మార్చుకునే వరకు ఈ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తేల్చి చెప్పింది. ఈ మేరకు రివల్యూషనరీ గార్డ్ కమాండర్, కౌన్సిల్ కార్యదర్శి మహమ్మద్ బాగేర్ జోల్గాదర్ ద్వారా ఇరాన్ ప్రభుత్వ ప్రసార మాధ్యమం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ జలమార్గం, దానిపై జరిగే రవాణాను నిర్వహించే ఒప్పందంపై చర్చలను కుదిపేయగల కొత్త డిమాండ్లను కూడా ఇది జారీ చేసింది.

ఫోన్ చేసి బతిమిలాడారు.. చివరి నిమిషంలో తప్పిన మహాయుద్ధం: ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!
ఫోన్ చేసి బతిమిలాడారు.. చివరి నిమిషంలో తప్పిన మహాయుద్ధం: ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!

ఇరాన్ విధించిన ప్రధాన షరతులు
అమెరికా భవిష్యత్తులో ఇరాన్ ను ఎప్పుడూ బెదిరించకూడదని.. అలాగే ఇరాన్, ప్రాంతీయ భాగస్వామ్య దేశాలతో వివాదాలను అంతం చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. దీంతో పాటు ఇరాన్ ఓడరేవులపై విధించిన నావికాదిగ్బంధానానని తక్షణమే ఎత్తివేసి ఆ ప్రాంతం నుంచి అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించడంతో పాటు ఆంక్షలను ఎత్తివేసి.. స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను ఎటువంటి షరతులు లేకుండా విడుదల చేయాలని కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది. ఈ డిమాండ్లపై అమెరికా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాకపోవడం గమనార్హం.

Iran Supreme National Security Council Demands America Change Behavior to Reopen Strait of Hormuz

ముమ్మరంగా ఇరాన్-ఒమన్ చర్చలు
మరోవైపు ఇరాన్, ఒమన్ దేశాలు హార్ముజ్ జలసంధి నిర్వహణపై ఒప్పందం కుదుర్చుకోవడానికి పూర్తిగా సిద్ధమైనట్లు తెలుస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఒమన్.. ఈ చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరుగుతున్నాయని వెల్లడించింది. అదే సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నౌకల రాకపోకలను సురక్షితంగా నిర్వహించడంపై చర్చలు పురోగతిలో ఉన్నాయి.

25 పెళ్లిళ్లు.. బయటపడిన బీజేపీ ఎమ్మెల్యే వియ్యంకుడి బాగోతం!
25 పెళ్లిళ్లు.. బయటపడిన బీజేపీ ఎమ్మెల్యే వియ్యంకుడి బాగోతం!

వాణిజ్య నౌకలపై దాడులు
హార్ముజు జలసంధి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అబుదాడికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ 'ఆడ్నోక్'కు చెందిన ఓ చమురు నౌకపై ఇరాన్ మిస్సైల్ దాడికి పాల్పడినట్లు యూఏఈ ధ్రువీకరించింది. ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ చర్యల నుంచి ఇప్పటివరకు తమ సంస్థకు చెందిన 12 కంటే ఎక్కువ నౌకలపై దాడులు జరిగాయని.. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 20 మంది గాయపడ్డారని ఆడ్నోక్ వెల్లడించింది. తాజా దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+