పాకిస్తాన్ లో.. 1979 నాటి ఇస్లామిక్ రివాల్యూషన్ తర్వాత
అమెరికా- ఇరాన్ యుద్ధంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఆ దేశంతో చర్చల కోసం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఈ తెల్లవారు జామున ఇస్లామాబాద్ కు చేరుకుంది. తమ ముందస్తు షరతులను అంగీకరిస్తేనే చర్చలు ప్రారంభమవుతాయని ఇరాన్ స్పష్టం చేయడం, దీనికి అమెరికా తల ఊపడంతో ఆ దేశ ప్రతినిధులు పాకిస్తాన్ లో అడుగు పెట్టారు.
ఇరు దేశాల మధ్య నెలకొన్న సంఘర్షణను అంతం చేయడానికి కీలక దౌత్య ప్రయత్నాలకు ఇది నాంది పలుకుతుందని ఇరాన్ మీడియా పేర్కొంది. అమెరికాతో శాంతి చర్చల కోసం ఇరాన్ తరపున ఒక ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు చేరుకుందని వెల్లడించింది. ఈ ప్రతినిధి బృందంలో పలువురు సీనియర్ రాజకీయ, సైనిక, ఆర్థిక అధికారులు ఉన్నారు. స్పీకర్ బాకర్ ఖాలిబాఫ్తో పాటు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరచ్చి, సుప్రీం నేషనల్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ అలీ అక్బర్ అహ్మాదియన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్నాసర్ హెమ్మతి వంటి నేతలు ఇందులో ఉన్నారు.

ఇరాన్ మాజీ ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ బాకర్ జాల్ఘదర్, అనేక మంది పార్లమెంటు సభ్యులు కూడా ఈ బృందంలో చేరుతారని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ చర్చలలో అన్ని దేశాలు నిర్మాణాత్మకంగా పాల్గొంటాయని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ అత్యున్నత స్థాయి చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయం తెలిసిందే. కాల్పుల విరమణ ఒప్పందాల ఉల్లంఘన, దీనివల్ల తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, పరస్పర అపనమ్మకాల వంటి వాతావరణం మధ్య ఈ సమావేశం జరుగబోతోంది.
అధికారిక చర్చలు ప్రారంభం కావడానికి ముందే కొన్ని చర్యలు చేపట్టాలని ఇరాన్ పదేపదే తేల్చి చెప్పింది. వీటిలో ప్రాంతీయ భద్రత సమస్యలు, ఆర్థిక ఆంక్షల తొలగింపు వంటివి ఉన్నాయి. లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడిని కూడా కాల్పుల విరమణ చర్చల్లో చేర్చాలనేది ఇరాన్ డిమాండ్. అలాగే ఆంక్షల కింద స్తంభింపజేసిన తమదేశ ఆస్తులను సైతం బేషరతుగా విడుదల చేయాలని పట్టుబట్టింది. ఈ అంశాలు చర్చల అజెండాలో ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా తెలియరావట్లేదు.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత జరుగుతున్న అత్యున్నత స్థాయి అమెరికా-ఇరాన్ సమావేశం ఇది. నాటి రివాల్యూషన్ తర్వాత దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య తీవ్ర శత్రుత్వం కొనసాగుతోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లతో కూడిన ప్రతినిధి బృందం ఇస్లామాబాద్కు బయలుదేరింది. స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ల పట్ల ఇరాన్ ఇప్పటికీ జాగ్రత్తగానే ఉంటోంది. గతంలో ఒమాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చలలో వీళ్లిద్దరూ పాలుపంచుకున్నారు. ఆ తర్వాతే ఇరాన్ పై దాడులు ఆరంభం అయ్యాయి.
-
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
పాకిస్తాన్ వెళ్తోన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ క్షేమంగా వెనక్కి రావాలని ప్రార్థనలు చేయండి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..!












Click it and Unblock the Notifications