పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సూమ్ కన్నుమూత
లండన్/కరాచి: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సూమ్ షరీఫ్ కన్నుమూశారు. ఆమె లండన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె గొంతు క్యాన్సర్తో బాధపడుతున్నారు.
ఆమె లండన్లోని హార్లీ స్ట్రీట్ క్లినిక్ ఆసుపత్రిలో 2014 జూన్ నుంచి చికిత్స పొందుతున్నారు. ఆమె వయస్సు 68. ఆమె మృతిని పాకిస్తాన్ ముస్లీం లీగ్ అధ్యక్షులు షెహబాజ్ షరీఫ్ కన్ఫర్మ చేశారు. మా వదిన చనిపోయిందని ఉర్దూలో ట్వీట్ చేశారు.

నవాజ్ షరీఫ్, కుల్సూమ్ల వివాహం 1971లో జరిగింది. వీరికి నలుగురు పిల్లలు. షరీఫ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమెను చూడటానికి తరచూ లండన్కు వెళ్లేవారు 2017 ఆగస్ట్లో కుల్సూమ్ గొంతు క్యాన్సర్కు గురయ్యారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఆమె మృతిచెందారు.
అవినీతి కేసులో దోషిగా తేలిన నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం షరీఫ్ ప్రస్తుతం రావల్పిండి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. పనామా పత్రాల కుంభకోణానికి సంబంధించి షరీఫ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనపై పాకిస్తాన్ సుప్రీం కోర్టు అనర్హత వేటు వేసింది. దీంతో షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications