కరేబియన్ దీవుల్లో కుప్పకూలిన విమానం.. తొమ్మిది మంది మృతి
వెస్టిండీస్ దేశంలోని కరేబియన్ దీవుల్లో ఘోర విమన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. ఈ విమానం డొమినికన్ రిపబ్లిక్లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొన్ని నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. జెట్ టేకాఫ్ అయిన 15 నిమిషాలకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ విమాన ప్రమాదంతో ఇద్దరు విమాన సిబ్బందితో పాటు ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ విమానం డొమినికన్లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్లోరిడా వెళ్తుంది. విమాన టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాజధాని శాంటో డొమింగోలో ఉన్న లాస్ అమెరికాస్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం చక్రలు రన్వే వైపు తాకగానే ఒక్కసారిగా విమానం పేలిపోయింది.
ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారని అధికారులు తెలిపారు. వారిలో ఆరుగురు విదేశీయులు , ఇద్దరు సిబ్బంది, ఒకరు డొమినికన్ కి చెందిన వారిగా పేర్కొన్నారు. అయితే ఆరుగురు విదేశీయులు మాత్రం ఏయే దేశాలకు చెందిన వారు అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదని స్థానిక మీడియా వెల్లడించింది.