మోడీ మరో విజయం, మాల్యాకు లండన్ కోర్టు భారీ షాక్: ఆస్తులు సీజ్! ఇంట్లో సోదాలు
లండన్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి లండన్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు భారీ షాక్. అతని ఆస్తులు జఫ్తు చేయాలని యూకే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లండన్ సమీపంలోని హెర్ట్ఫోర్డ్షైర్లోని మాల్యాకు చెందిన ఆస్తులను జఫ్తు చేయాలని సదరు న్యాయస్థానం ఆదేశించింది.
అంతేకాదు, అతను నివాసం ఉంటున్న చోట సోదాలు చేయాలని చెప్పింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పరిగణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. మాల్యా విషయంలో భారత ప్రభుత్వం చర్యలను సమర్థించింది. కాగా, లండన్ కోర్టు ఆదేశాలు భారత ప్రభుత్వం విజయం కాగా, బ్యాంకులకు ఊరట అని చెప్పవచ్చు.

కాగా, మాల్యాకు చెందిన ఆస్తుల వివరాల విషయంలో కొంత స్పష్టత వచ్చింది. మొత్తం 159 చోట్ల ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఈడీతో కలిసి బెంగళూరు పోలీసులు దీనికి సంబంధించిన నివేదికలను గురువారం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు సమర్పించారు. మాల్యాకు చెందిన మరిన్ని ఆస్తులను గుర్తించేందుకు మరింత సమయం కావాలని కోరారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications