ఎంహెచ్ 17: ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి
కౌలాలంపూర్: తూర్పు ఉక్రెయిన్లో క్షిపణి దాడిలో కూలిపోయిన విమాన ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఈ మేరకు దిస్టార్.కామ్ కథనం వెల్లడించింది. కుచింగ్ నగరానికి చెందిన ఆ కుటుంబ సభ్యులు కజకిస్థాన్ నుంచి అమ్స్టర్డమ్ మీదుగా వెళుతుండగా ఈ ప్రమాదం జరగడంతో అక్కడిక్కడే మృతి చెందారు.
తంబి జీ(49), అతని భార్య అరిజ ఘజలీ(47), వారి పిల్లలు మహ్మద్ అఫీఫ్(19), మహ్మద్ అప్జల్(17), మార్ష అజ్మీనా(15), మహ్మద్ అఫ్రుజ్(13)లు ఈ దుర్ఘటనలో తమ ప్రాణాలు కోల్పోయారు.
గత మూడు సంవత్సరాలుగా కజకిస్థాన్లో పని చేస్తున్న తంబి జీ అతని కుటుంబ సభ్యులతోపాటు అక్కడి నుంచి మలేషియా విమానం ఎంహెచ్ 17లో తిరిగి వస్తున్నారు.
అమ్స్టర్డమ్ నుంచి కౌలాలంపూర్ బయల్దేరిన ఆ మలేషియా విమానాన్ని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో క్షిపణి దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెద్ద ఎత్తును మంటలు ఎగిశాయి. ఈ దుర్ఘటనలో విమానంలోని 298 ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది మృత్యువాతపడ్డారు.