నరేంద్ర మోడీ ఇప్పటికీ పాపులరే: పాకిస్థాన్ డెయిలీ
ఇస్లామాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ‘చాలా పాపులర్' అని ఓ పాకిస్థాన్ డెయిలీ పేర్కొంది. అయితే బీహార్ ఫలితాలు మోడీ మ్యాజిక్ను కొంత తగ్గించేశాయని మంగళవారం తన కథనంలో వెల్లడించింది.
‘భారతదేశంలో బీహార్ ఒక రాష్ట్రం మాత్రమే. దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. మోడీ ఇప్పటికీ చాలా పాపులర్' అని ఆ పాకిస్థాన్ డెయిలీ ‘ది నేషన్' తన ఎడిటోరియల్లో పేర్కొంది.

బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం ఎటూ పోలేదని వెల్లడించింది.
‘అయితే ఒక విషయం స్పష్టమైంది. ఇక రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ పెద్దగా పని చేయకపోవచ్చు. రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, సామాజిక అంశాలు ప్రభావితం చూపిస్తాయి' అని పేర్కొంది.
హేట్ పాలిటిక్స్ భారతదేశం వ్యతిరేకమని బీహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని పాక్ డెయిలీ తన ఎడిటోరియల్లో వెల్లడించింది.
-
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్..?? -
"ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్.. ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ముగింపు" -
T20 World Cup Final: భారత పేసర్ కు ఐసీసీ డబుల్ షాక్..! -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
2 వారాల పాటు పాఠశాలలకు సెలవులు.. కారణం ఇదే.. -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
భారత్ గెలిస్తే ఏంటట: పాకిస్తానోళ్లు కడుపు మంటతో పోయేట్టున్నారయ్యో -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications