జపాన్ ప్రధాని షింజో అబేకి.. మోడీ శుభాకాంక్షలు
జపాన్ ప్రధాని షింజో అబేకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. షింజో అబే నేతృత్వంలోని పాలక కూటమి అక్కడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: జపాన్ ప్రధాని షింజో అబేకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. షింజో అబే నేతృత్వంలోని పాలక కూటమి అక్కడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ ప్రధానికి అభినందనలు తెలిపారు. జపాన్ దిగువ సభలో పాలక కూటమికి మూడింట రెండు వంతుల మెజారిటీ దక్కింది. భారత్, జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు ఈ గెలుపు ఉపకరిస్తుందని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

'ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్నేహితుడు షింజో అబేకు శుభాకాంక్షలు... ఈ గెలుపు భారత-జపాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో మేలి మలుపుకు శ్రీకారం చుడుతుంది..' అని మోడీ తన ట్వీట్లో తెలిపారు.
465 మంది సభ్యులు కలిగిన జపాన్ పార్లమెంట్ దిగువ సభలో పాలక లిబరల్ డెమొక్రటిక్ పార్టీ కూటమి 312 స్థానాల్లో గెలుపొందింది. ఉత్తర కొరియాతో ముప్పు పెరుగుతున్న క్రమంలో తాజాగా ప్రజల తీర్పు పొందేందుకు షింజో అబే గత నెలలో పార్లమెంట్ దిగువ సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications