11 ఏళ్ల భారత విద్యార్థిని ప్రేరణ ప్రయోగాలు రోదసీలోకి!

ఈ ప్రాజెక్టులో యూఏఈ నుంచి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక విద్యార్థి ప్రేరణే. ఈ ప్రాజెక్టులో మొత్తం వంద మంది విద్యార్థుల ప్రతిపాదనలను నాసా ఆమోదించింది. వీరిలో 75 మంది అమెరికా విద్యార్థులుండగా, మిగిలిన వారు ఇతర దేశస్థులు. జూన్ 26న నాసా ప్రయోగంలో వీటిని పరీక్షిస్తారు.
గత మే నెలలో చేపట్టిన సిఐఎస్ ప్రోగ్రామ్కు ప్రతిపాదనలు పంపాలంటూ 11-14 ఏళ్ల విద్యార్థులను నాసా కోరింది. దీంతో ప్రేరణ రెండు ప్రతిపాదనలు పంపింది. ప్రేరణ పాయ్ షార్జాలోని ఢిల్లీ ప్రయివేటు స్కూల్లో చదువుతోంది.
అంతరిక్ష పీడనంలో వివిధ జిగురు పదార్థాలు ఎలా ప్రభావితమవుతాయో తెలుసుకోవడం ప్రేరణ ప్రతిపాదనల్లో మొదటిది కాగా, మూతులు బిగించిన ప్లాస్టిక్, గాజు బాటిళ్లు అంతరిక్షంలో ఎలాంటి చర్యలకు గురవుతాయో తెలుసుకోవడం రెండోది. తన ప్రతిపాదనలపై నాసా ప్రయోగాలకు సిద్ధం కావడంపై ప్రేరణ సంతోషం వ్యక్తం చేసింది.












Click it and Unblock the Notifications