బంపర్ ఆఫర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండియన్స్ పోటీకి నేపాల్ గ్రీన్ సిగ్నల్
నేపాల్ లో నివసించే భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆ దేశం, ఇక నుండి నేపాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
ఖాట్మాండ్: నేపాల్ లో నివసించే భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆ దేశం, ఇక నుండి నేపాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
ఈ ఏడాది మే చివర్లో నేపాల్ స్తానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్ తో సరిహద్దులో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ , బీహార్ ప్రాంతాలను కలిసి ఉన్న ప్రాంతాలను టారాయి ప్రాంతంగా పిలుస్తారు.
ఈ ప్రాంతంలో నివసించే భారతీయులకు స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇప్పటి నుండి దక్కనుంది.నేపాల్ లో ఉంటున్న తమకు కూడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
గత ఏడు మాసాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ విషయమై భారతీయ దౌత్యవేత్తలు కూడ చర్చించారు. దీంతో దిగివచ్చిన అక్కడి ప్రభుత్వం సరిహద్దులో ఉంటున్న పెళ్ళి్ళు ఎలా జరుగుతున్నాయో అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ మేరకు అక్కడి పార్లమెంట్ లో కూడ సవరణ చేయనున్నారు. మదేసీలు అనే తెగ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నేపాల్ లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.