"ఉంగిలి చూపిస్తే పిడికిలితో కొడతాం": పాక్కు ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ మాస్ వార్నింగ్!
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు పూర్తి స్థాయి యుద్ధంగా మారుతోంది. రెండో రోజుకు చేరుకున్న ఈ పోరులో ఇరుదేశాలు భారీగా ప్రాణ, ఆస్తి నష్టాన్ని చవిచూస్తున్నాయి. తాజాగా ఆఫ్ఘన్ ఆర్మీ చీఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ పాకిస్థాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
12 మంది సైనికులు మృతి.. అంగీకరించిన పాకిస్థాన్
శుక్రవారం పాకిస్థాన్ సైన్యం నిర్వహించిన ప్రెస్ మీడియాలో కీలక విషయాలను వెల్లడించింది. ఆఫ్ఘన్ దాడుల్లో తమ వైపు 12 మంది సైనికులు మరణించారని.. ఒక సైనికుడు గల్లంతవ్వగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారికంగా అంగీకరించింది. అయితే తాము జరిపిన ఎదురుదాడుల్లో 274 మంది ఆఫ్ఘన్ పోరాట యోధులను మట్టుబెట్టినట్లు పాక్ ప్రకటించింది. అంతేకాకుండా ఆఫ్ఘనిస్థాన్కు చెందిన 73 చెక్ పోస్టులను ధ్వంసం చేశామని.. 18 పోస్టులను తమ ఆధీనంలోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ పేర్కొంది.

ఉంగిలి చూపిస్తే.. పిడికిలితో కొడతాం..
ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫసీహుద్దీన్ ఫిత్రత్ పాక్ మిలిటరీ నాయకత్వాన్ని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు. "పాకిస్థాన్ మా దేశ భూభాగంపై ఉంగిలి చూపిస్తే.. మేము పిడికిలితో సమాధానం చెబుతాం. మా భూభాగంపై జరిగే ఏ ఒక్క దాడిని కూడా మేము వదిలిపెట్టం. ఒకవేళ పాక్ తన దురాగతాలను కొనసాగిస్తే.. ఇస్లామాబాద్లోని ప్రధాన కేంద్రాల్లో కూడా మీరు సురక్షితంగా ఉండలేరు" అని ఆయన హెచ్చరించారు.
పాక్ రాజధానిలో ఆఫ్ఘన్ ఎయిర్ స్ట్రైక్స్
శుక్రవారం ఆఫ్ఘన్ దళాలు పాకిస్థాన్ గుండెల్లో నిద్రపోయాయి. ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని నివాసానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఆర్మీ క్యాంప్పై ఆఫ్ఘన్ దళాలు వైమానిక దాడులు చేశాయి. వీటితో పాటు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని నౌషెరా, జమ్రూద్, అబోటాబాద్ ప్రాంతాల్లో కూడా ఆఫ్ఘన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించి పాక్ బలగాలను కోలుకోలేని దెబ్బ తీశాయి.
ఇరు దేశాల వాదనలు ఇలా..
యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పర దాడులపై భిన్నమైన గణాంకాలను విడుదల చేస్తున్నాయి. తమ దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారని.. తమ వైపు కేవలం 8 మంది మాత్రమే అమరులయ్యారని ఆఫ్ఘన్ పేర్కొంది. ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వాన్ని ఒక "అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ"గా పాక్ అభివర్ణించింది. తమ ప్రతిదాడిలో ఆఫ్ఘన్కు చెందిన 115 ట్యాంకులు, ఆర్టిలరీ గన్లను ధ్వంసం చేశామని చెప్పుకొచ్చింది.
ప్రజల్లో ఆగ్రహం.. జిహాద్కు సిద్ధం
పాకిస్థాన్ వైఖరిపై ఆఫ్ఘనిస్థాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ను "ఇస్లాం, మానవత్వానికి శత్రువు"గా ఆఫ్ఘన్ పౌరులు అభివర్ణిస్తున్నారు. తమ నేతలు పిలుపునిస్తే దేశ రక్షణ కోసం 'జిహాద్' చేయడానికి కూడా తాము సిద్ధమని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. ఆఫ్ఘన్ హోం మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ కూడా పాకిస్థాన్కు వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తామని ప్రకటించారు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications