భారత సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్.. దాచేసిన నిజం ఇదే!
న్యూఢిల్లీ: ఉగ్రవాదులపై భారత సర్జికల్ దాడులను జీర్ణించుకోలేకపోతున్న పాకిస్థాన్.. పగతో రగిలిపోతోంది. యూరీ ఉగ్రదాడి అనంతరం భారత్ జరిపిన సర్జికల్ స్రైక్స్ అవాస్తమని బుకాయిస్తున్న పాకిస్థాన్.. ఓ పెద్ద రహస్యాన్నే దాచేసింది.
కాగా, భారత సర్జికల్ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదులతోపాటు ఇద్దరు పాక్ సైనికుల మృతదేహాలను ట్రక్కుల్లో రహస్యంగా తరలించి, ఖననం చేశారని సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న కొందరు ప్రత్యక్ష సాక్షులు ఓ ప్రముఖ జాతీయ మీడియా చేసిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సెప్టెంబర్ 29న రహస్యంగా మృతదేహాలను శ్మశానానికి తరలించి ఖననం చేశారని తెలిసింది. ఈ సర్జికల్ దాడుల్లో 38 నుంచి 70 మంది దాకా ఉగ్రవాదులను మన సైన్యం మట్టుపెట్టింది. ఈ దాడుల్లో మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలకు చెందిన వారని సమాచారం.

అంతేగాక, ఉగ్రవాదుల స్థావరాలను, సామాగ్రిని సైన్యం ధ్వంసం చేసిందని కొందరు ప్రత్యక్ష సాక్ష్యులు సదరు జాతీయ మీడియాకు తెలిపారు. కాగా, వారి భద్రత దృష్యా వారి పేర్లను వెల్లడించడం లేదని సదరు మీడియా ప్రకటించింది. అయితే, పాక్ మాత్రం భారత సర్జికల్ దాడులు ఉత్తవేనంటూ బయటికి చెప్పుకుంటుండటం గమనార్హం.
ఇది ఇలా ఉండగా, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రస్తుత పరిస్థితిపై ఇస్లామాబాద్ లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరుపుతున్నారు. తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే, తమ దేశం కోసం ఎలాంటి చర్యలకైనా సిద్ధమేనని షరీఫ్ సమావేశంలో పేర్కొన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications