భారత్లో విమాన ప్రమాదం.. పాకిస్థాన్ ప్రధాని షాకింగ్ ట్వీట్
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు.

ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటనలో భారత్ కు చెందిన 169 మంది ప్రయాణికులు మృతి చెందగా.. బ్రిటన్ కు చెందిన 53 మంది.. పోర్చుగీసుకు చెందిన ఏడుగురు.. కెనడాకు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇక 625 అడుగుల ఎత్తులోంచి ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోవడంతో 265 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. దీంతో ఎవర్నీ గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి.
అయితే ప్రస్తుతం భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తో ఇరు దేశాల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో విమాన ప్రమాదం ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంలో మృతులకు సానుభూతి తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా తాను బాధపడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Saddened by the tragic crash of Air India flight near Ahmedabad today.
— Shehbaz Sharif (@CMShehbaz) June 12, 2025
We extend our condolences to the families of the victims grieving this immense loss.
Our thoughts and prayers are with all those affected by this heartbreaking tragedy.
మరోవైపు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ కూడా విమాన ప్రమాదం ఘటనపై ట్వీట్ చేశారు. 'తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటన సరిహద్దులను చెరిపి మానవత్వంతో ఆలోచించే విధంగా చేసింది. దేశ ప్రజలకు.. ప్రధాని మోదీకి సానుభూతి తెలియజేస్తున్నా. అని నవాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు.
My heartfelt condolences to the families of the precious lives lost in the tragic Air India plane crash in Ahmedabad. This devastating loss transcends borders and reminds us of our shared humanity. My deepest sympathies to Prime Minister Modi and the people of India.
— Nawaz Sharif (@NawazSharifMNS) June 12, 2025
మరోవైపు విమాన ప్రమాదం ఘటనపై బ్లాక్ బాక్స్ లభించింది. ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత బ్లాక్ బాక్స్ లభించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో విమాన ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. అంతేకాక విమాన ప్రమాద కారణాలపై ఎన్ఐఏ సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు విమాన ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఎన్ఐఏ బృందం పరిశీలించింది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications