మిమ్మల్ని నల్లుల్ని నలిపినట్టు నలిపేస్తాం- పాకిస్తాన్ ప్రధాని
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమౌతోంది. అఫ్ఘానిస్తాన్లోని పలు నగరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో పలు పేలుళ్లు సంభవించాయి. విమానాల శబ్దాలు వినిపించాయి. మిస్సైళ్ల మోతలతో ఉలిక్కిపడింది కాబుల్. మరో ప్రధాన నగరం కాందహార్ తో పాటు పాకిస్తాన్ తో సరిహద్దులను పంచుకుంటోన్న పక్టికాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మెరుపుదాడులతో ఆప్ఘనిస్తాన్ నగరాలు అట్టుడికిపోయాయి.
దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వం. సరిహద్దులపై విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ సైన్యానికి చెందిన పలు క్యాంప్ లను స్వాధీనం చేసుకుంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన జేఎఫ్-17 పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘన్ బలగాలు కూల్చివేశాయి. తూర్పు, ఆగ్నేయ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నాలుగు గంటల ఆపరేషన్లో రెండు పాక్ సైనిక స్థావరాలు, 19 అవుట్పోస్టులు ధ్వంసం అయ్యాయి. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాయి.

ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తెర మీదికి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. తాలిబన్లను దురాక్రమణదారులుగా అభివర్ణించారు. తమ సాయుధ బలగాలు వారిని చిత్తు చేయగలవని తేల్చి చెప్పారు. తాలిబన్లను నలిపేస్తామని స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే తమ సైన్యం అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సరిహద్దులు దాటుకుని ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై మరిన్ని దాడులు ఉంటాయని అన్నారు.
తమ బలగాలకు ఎలాంటి దురాక్రమణ ఆశయాలనైనా అణచివేసే పూర్తి సామర్థ్యం ఉందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వ ఎక్స్ ఖాతాలో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. దేశ ప్రజలందరూ తమ సాయుధ బలగాలకు భుజం భుజం కలిపి నిలబడతారని చెప్పారు. వెనుకంజ వేసే ప్రసక్తే ఉండబోదని అన్నారు.
సరిహద్దులను పంచుకుంటోన్న ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పదేళ్ల కనిష్ట స్థాయికి చేరినట్టయింది.. తాజా దాడులతో. వివాదాస్పద డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ గుర్తించకపోవడం, తాలిబన్ ప్రోత్సాహిత తెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (టీటీపీ) తమ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరింపజేయడం ఈ పరిణామాలకు దారి తీసింది. కొద్దిరోజుల కిందటే ఈ రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడిది యుద్ధం దాకా వెళ్లింది.
-
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!












Click it and Unblock the Notifications