వయా శ్రీలంక..: భారత్పై పాక్ మరో దుష్ట పన్నాగం
న్యూఢిల్లీ: భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ కుట్ర మరొకటి బయట పడింది. భారత్ పైకి ఉసిగొల్పేందుకు శ్రీలంకలోని ముస్లీంలను కూడా పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చాలా ఏళ్లుగా ఉపయోగించుకుంటున్నట్లు తేలింది.
శ్రీలంక దినపత్రిక సిలోన్ టుడేలో ఇందుకు సంబంధించి కథనం వ్చచింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా, దాని దాతృత్వ సంస్థ ఇదర ఖిడ్మతే ఖల్క్ (ఐకేకే)లను ఐఎస్ఐ ఇందుకోసం ఉపయోగించుకుంటోంది. 2004లో సునామీ తర్వాత లష్కరే-ఐకిక్ ఉగ్రవాదులను శ్రీలంకలో గుర్తించారు.

సునామీ తర్వాత సచ్ఛంద కార్యకర్తల పేరుతో శ్రీలంక, మాల్దీవుల్లో అడుగుపెట్టిన వీరు జిహాదీలను రిక్రూట్ చేసే పనిలో పడ్డారు. ఆయా ప్రాంతాలకు చెందిన ఎందరో యువకులు పాకిస్థాన్లోని లష్కరే తాయిబా ఉగ్రస్థావరాలు, ఖైబర్ పంక్తుంఖ్వాలోని గిరిజన ప్రాంతాలకు తరలివెళ్లారు.
భారత్ను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టేందుకే ఐఎస్ఐ శ్రీలంకను ఉపయోగించుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. దక్షిణాదిన దాడులకు తెగబడడంతోపాటు యువకులను చేర్చుకునేందుకు కూడా ఉపయోగించుకుంటోంది.
శ్రీలంకలోని ముస్లిం ప్రాంతాల్లో తమ నెట్వర్క్ను పెంచిన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయాద్, అబ్దుల్ రమమాన్ మక్కికి అత్యంత సన్నిహితుడైన మౌలానా ఉమర్ మదానీ కార్యకలాపాలను జూన్, 2009లో శ్రీలంకలో గుర్తించారు. అంతకు ముందే మదానీ భారత్లో పట్టుబడ్డాడు. 2014లో అరెస్టు అయిన షకీర్ హుస్సేన్ కూడా విచారణలో షాకింగ్ వాస్తవాలు వెల్లడించాడు.
చెన్నైలోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయిల్ కాన్సులేట్ను పేల్చాలని ఐఎస్ఐ ప్రణాళిక రచించినట్టు చెప్పాడు. అతని వద్ద లభించిన పాకిస్థాన్ వీసా శ్రీలంక నుంచి పొందినది. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు నకిలీ కరెన్సీ నోట్లను అక్రమంగా తెచ్చేందుకు కూడా ఐఎస్ఐ శ్రీలంకను ఉపయోగించుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications