పఠాన్కోట దాడి: పాక్లో అరెస్టులు, ఆఫీసుల సీల్
ఇస్లామాబాద్: పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడికి పాల్పడిందని భావిస్తు జైష్ ఎ మొహ్మద్ ఉగ్రవాద సంస్థపై పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలకు దిగింది. ముల్తాన్, బహవల్పూర్ సహా మొత్తం నాలుగు పట్టణాల్లోని మూడు కార్యాలయాలకు సీల్ వేశారు. బుధవారంనాడు 10 మందిని అరెస్ట్ చేశారు.
జైష్ ఎ మహ్మద్ కార్యాలయాలనుంచి అనుమానాస్పద సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాడులు కొనసాగుతున్నాయి. మరింతమందిని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. భారత్ ఇచ్చిన ఆధారాలపై మరింత సమాచారం సేకరించి పాక్ అధికారులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.
మసూద్ అజర్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు కార్యాలయాలను మూసేసినట్లు పాకిస్తాన్ మీడియా రాసింది. పఠాన్కోట దాడిపై దర్యాప్తు చేసేందుకు పాకిస్తాన్ అధికారులను భారత్ పంపించనుంది. పాకిస్తాన్లోని ఉగ్రవాదులో పఠాన్కోట దాడికి బాధ్యులని భారత హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు.
పాకిస్తాన్ తీసుకునే చర్యల కోసం నిరీక్షించాల్సి ఉందని ఆయన మంగళవారంనాడు చెప్పారు. సమర్థమైన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ హామీ ఇచ్చినట్లు కూడా తెలిపారు. చర్యలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని తాము పాకిస్తాన్ ప్రభుత్వానికి అందించినట్లు కూడా తెలిపింది.