Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూరోపియన్ పార్లమెంటు సభ్యులతో రాహుల్ గాంధీ ప్రత్యేక భేటీ: మణిపూర్ అంశంపై చర్చ

బ్రస్సెల్స్: కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ తన మూడు దేశాల యూరోపియన్ పర్యటనలో భాగంగా గురువారం బ్రస్సెల్స్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది యూరోపియన్ పార్లమెంట్ (MEP) సభ్యులతో క్లోజ్డ్ డోర్ సమావేశాలు నిర్వహించారు.

బెల్జియం రాజధానిలో ఆయన సమావేశాల్లో లేవనెత్తిన అంశాల్లో మణిపూర్‌లోని మానవ హక్కుల పరిస్థితి కూడా ఉండటం గమనార్హం. జూలైలో యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించిన 'భారతదేశం, మణిపూర్ పరిస్థితి' అనే తీర్మానం నేపథ్యంలో ఈ సమావేశాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.

Rahul Gandhi meets members of European Parliament in Brussels: discussed on Manipur situation

ఆనాటి అధికారిక పార్లమెంటరీ ఎజెండాలో జాబితా చేయని బ్రస్సెల్స్‌లో చర్చలు విజయవంతమయ్యాయని ప్రతిపక్ష పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. న్యాయవ్యవస్థతో సహా అన్ని స్థాయిలలోని భారత అధికారులు మణిపూర్‌లోని పరిస్థితుల గురించి బాగా తెలుసుకుని శాంతి, సామరస్యం, శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారని భారతదేశం గతంలో పేర్కొంది.

'యూరోపియన్ పార్లమెంట్ తన అంతర్గత సమస్యలపై మరింత ఉత్పాదకతతో సమయాన్ని వినియోగించుకోవాలని సూచించింది' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ.. జూలైలో భారతదేశంలోని మణిపూర్‌లో ఘర్షణలు, మానవ హక్కుల పరిస్థితిపై యూరోపియన్ పార్లమెంట్ తీర్మానాన్ని ఆమోదించిన సమయంలో తేల్చి చెప్పారు. 'భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఇటువంటి జోక్యం ఆమోదయోగ్యం కాదు, వలసవాద ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తుంది' అని ఘాటుగా బదులిచ్చారు.

కాగా, రాహుల్ తాజా సమావేశాన్ని కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ధృవీకరించింది. గురువారం తరువాత, యూరోపియన్ యూనియన్ (EU)లోని మానవ హక్కుల సమస్యలపై దృష్టి సారించిన పౌర సమాజ సంస్థలు నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బెల్జియంలోని భారతీయ ప్రవాసులతో విందులో పాల్గొనడంతోపాటు వారితో ముచ్చటిస్తారు రాహుల్.

రాహుల్ గాంధీ శుక్రవారం బ్రస్సెల్స్‌లో వ్యాపార నాయకులతో సమావేశం, మీడియా ఇంటరాక్షన్ తర్వాత పారిస్ బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన శుక్రవారం తరువాత ఫ్రెంచ్ రాజధానిలో మీడియాను ఉద్దేశించి కూడా తాత్కాలికంగా షెడ్యూల్ చేసుకున్నారు.

శనివారం, ఆయన ఫ్రెంచ్ పార్లమెంటేరియన్లతో సమావేశం నిర్వహించి, ఆదివారం నెదర్లాండ్స్‌కు బయలుదేరే ముందు సైన్సెస్ పో విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సంభాషిస్తారని భావిస్తున్నారు. అక్కడ 400 ఏళ్ల చరిత్ర కలిగిన లైడెన్ యూనివర్సిటీని సందర్శించి విద్యార్థులతో సంభాషించనున్నారు.

సెప్టెంబర్ 11న, కాంగ్రెస్ నాయకుడు నార్వేకు వెళతారు, అక్కడ ఆయన రాజధాని ఓస్లోలో దేశ పార్లమెంటేరియన్లను కలుస్తారు. ప్రవాస భారతీయులను కూడా కలుసుకుంటారు, ఓస్లో విశ్వవిద్యాలయంలో ఒక సమావేశానికి హాజరవుతారు. కాగా, రాహుల్ గాంధీ కోసం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. G20 సమ్మిట్ ముగిసిన ఒక రోజు తర్వాత ఆయన సెప్టెంబర్ 12 రాత్రి తిరిగి రావాల్సి ఉంది. సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు ఢిల్లీలో జీ20 లీడర్స్ సమ్మిట్ జరగనున్న విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+