తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులు : 24 మంది మృతి
కాబూల్ : ఉగ్రవాదుల లక్ష్యంగా ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు వైమానిక దాడులు చేశాయి. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సుల్లో చేసిన దాడుల్లో 24 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ మేరకు ఆప్గానిస్థాన్ మిలిటరీ మీడియాకు వివరాలు తెలియజేసింది.

ప్రతీకారం తీర్చుకుంది ..
తమ దేశంలో దాడులకు తెగబడుతున్న తాలిబన్లపై ఆప్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ తాలిబన్లు లక్ష్యంగా దాడులు చేపట్టింది. పక్తీకా ప్రావిన్సులో జుర్మాత్, బెర్మాల్ జిల్లాల్లో 20 మంది తాలిబన్లను హతమార్చారు. గజనీ ప్రావిన్సులోని అందర్ జిల్లాలో ఇద్దరు, హేరాత్ ప్రావిన్సులోని ఫర్సీ జిల్లాలో మరో ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆప్గానిస్థాన్ లో తాలిబన్లు ఉగ్రవాద చర్యలను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు. అయితే ఆప్గానిస్థాన్ భద్రతా బలగాలు చేపట్టిన దాడుల గురించి తాలిబన్లు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అస్థిరత్వం ..
తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదుల చర్యల కారణంగా ఆప్గానిస్థాన్ లో రాజకీయ అస్థిరత నెలకొంది. దీంతోపాటు సామాజికంగా దేశం వెనుకబాటుకు గురైంది. భద్రత సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో దేశంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో మిత్ర దేశాల సాయం తీసుకున్నాయి. ఉగ్ర వ్యతిరేక చర్యలు తీసుకుంటూ .. ఉగ్రమూకలపై ఉక్కుపాదం మోపుతుంది. హేరాత్, పక్తీకా, గజనీ ప్రావిన్సులతో పాటు హెల్మాంద్, ఉరుజ్గాన్, జాబూల్, నంగర్హర్ ప్రావిన్సుల్లోనూ భద్రతా బలగాలు ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు జరుపుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి వివరాలు .. ఉగ్రవాదుల మృతికి సంబంధించిన డిటైల్స్ తెలియాల్సి ఉంది.
దాడి .. ప్రతీ దాడి
ఆప్గానిస్థాన్ లో తాలిబన్లు దాడులు చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆప్గానిస్థాన్ తమ భాగస్యామ్వ పక్షాలతో కలిసి ... తాలిబన్లపై దాడులకు దిగుతోంది. ఇవాళ చేసిన దాడుల్లో పదుల సంఖ్యలో ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదివరకు తాలిబన్లు చేసిన దాడుల్లో అమాయక అప్గనిస్థాన్లు చనిపోయిన సంగతి తెలిసిందే.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications