చైనా చెల్లా చెదురు: 111 మంది దుర్మరణం
China earthquake: చైనాలో భారీ భూకంపం సంభవించింది. రెండు ప్రావిన్సులను వణికించింది. భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. 111 మందిని పొట్టనబెట్టుకుంది. 200 మందికి పైగా గాయపడ్డారు. పలు భవనాలు నేలమట్టం అయ్యాయి. భవనాల శిథిలాల కింద చాలామంది చిక్కుకుని ఉన్నారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరగొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి.
చైనా వాయవ్య ప్రాంతంలోని గాన్సు ప్రావిన్స్లో ఈ అర్ధరాత్రి దాటిన తరువాత ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా రికార్డయింది. భూమి ప్రకంపించగానే జనం ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. ఫలితంగా- తమ ఇళ్లల్లోకి వెళ్లడానికి ప్రజలు భయపడ్డారు.

దీని తీవ్రత పొరుగునే ఉన్న క్వింఘై ప్రావిన్స్పైనా పడింది. ప్రధాన భూకంపం సంభవించిన గాన్సు ప్రావిన్స్లో 100 మంది, క్వింఘై ప్రావిన్స్లో 11 మంది మరణించినట్లు చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ గ్ఝిన్హువా తెలిపింది. అలాగే గాన్సులో 96, క్వింఘైాలో 124 మంది గాయపడినట్లు వివరించింది.
గాన్సు ప్రావిన్స్లోని జిషిషాన్ బోనన్ కంట్రీని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఈ ప్రావిన్స్ రాజధాని లాంగ్ఘౌకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. జిషిషాన్కు 37 కిలోమీటర్ల దూరంలో గల లింగ్ఝియా ఛెంగ్వాన్ఝెన్ వద్ద ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

భూకంపం తీవ్రత లాంగ్ఝౌ, జిషిషాన్ బోనన్, లింగ్ఝియా వంటి ప్రాంతాలపై పడింది. ప్రకంపనలు సంభవించిన వెంటనే లాంగ్ఝౌ యూనివర్శిటీ విద్యార్థులు బయటికి పరుగులు తీయడానికి సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది. యూనివర్శిటీ క్యాంపస్లో వారంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications