విడాకులివ్వకుండానే 11 మందితో వివాహం: వివాహితను రాళ్ళతో కొట్టిన చంపారు
Recommended Video
మొగదిషు: విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్న ఓ మహిళలను రాళ్ళతో కొట్టి చంపిన ఘటన సోమాలియాలో చోటు చేసుకొంది. ఆల్ షబాబ్ అనే మిలిటెంట్ సంస్థకు చెందిన వారు ఈ మహిళకు అత్యంత దారుణమైన ఈ శిక్షను విధించారు.
సోమాలియా రాజధాని మొగదిషుకు సమీపంలో షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళ విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొంది. ఈ విషయం ఇటీవల బట్టబయలైంది. షరియా చట్టం ప్రకారంగా ఈ రకంగా వివాహలు చేసుకోవడం తప్పని ఆల్ షబాబ్ మిలిటెంట్లు వాదిస్తున్నారు.
ఆల్ షబాబ్ మిలిటెంట్లు షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ అనే మహిళను ఎట్టకేలకు పట్టుకొన్నారు. విడాకులు ఇవ్వకుండానే 11 మందిని వివాహం చేసుకొన్నందుకు గాను ఆమెను కొట్టి చంపాలని నిర్ణయించారు.
విచారణ సమయంలో ఆమె 8 మంది భర్తలను పిలిపించారు. 8 మంది కూడ ఆమె తన భార్యగా చెప్పారు. ఆ మహిళకు 8 మంది పిల్లలున్నారు. దీంతో ఆమెను కొట్టి చంపాలని ఆ మిలిటెంట్ సంస్థ తీర్మానం చేసింది. షుక్రి అబ్దుల్లాహీ వర్సెమ్ ను గొంతు వరకు భూమిలో పూడ్చేశారు. రాళ్ళతో కొట్టి చంపారు.