Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"ద డర్డీ 7".. పాక్ రక్షణలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు.. ప్రపంచానికి పెను సవాల్!

Most Wanted Terrorists: ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులలో కొందరు పాకిస్థాన్‌లో బహిరంగంగా సంచరిస్తున్నారు. ఆ దేశ ప్రభుత్వం, సైన్యం వారిని రక్షిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లక్షలాది డాలర్లు నజరానాలు ఉన్న.. భారత్, విదేశాలలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న భయంకరమైన దాడులను ప్లాన్ చేసిన ప్రపంచంలోని అత్యంత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు.. ఎక్కడో మారుమూలల్లో దాక్కోవడం లేదు. పాకిస్థాన్ దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారు. పాక్ సైన్యం, 'డీప్ స్టేట్'వారిని వెనకుండి నడిపిస్తూ రక్షిస్తున్నాయి. భారత్‌పై అగ్రదాడులను ప్లాన్ చేస్తూ యువతీ యువకులను హింసను ప్రేరేపించడానికి నియమిస్తున్నారు. వారికి విలాసవంతమైన జీవితాన్ని అందిస్తున్నారు. పాక్ ఆధారిత లష్కర్-ఇ-తొయిబా ప్రాక్సీ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' ఉగ్రవాదులు 26 మందిని చంపిన పహల్గామ్ దాడి తర్వాత.. ఈ ఉగ్రవాద నాయకులపై, పాకిస్థాన్ పాత్రపై ప్రపంచం దృష్టి సారిస్తోంది.

'డర్టీ 7': పాకిస్తాన్ పెంపుడు ఉగ్రవాదులు - భారత్‌కు నిరంతర ముప్పు

1. హఫీజ్ సయీద్:
హఫీజు సయీద్ లష్కర్-ఇ-తొయిబా ఉగ్రవాద సంస్థకు అధిపతి. దీనిని హఫీజ్ సయీద్ 1990ల ప్రారంభంలో మార్కజ్-ఉద్-దావా-వల్-ఇర్షాద్ సైనిక విభాగంగా స్థాపించాడు. లష్కర్-ఇ-తొయిబా భారత సైనికులపై, దేశవ్యాప్తంగా పౌర లక్ష్యాలపై అనేక దాడులకు బాధ్యత వహించింది. 2006లో ముంబైలో జరిగిన రైలు బాంబు దాడులు, 26/11 ముంబై దాడులు లష్కర్ ఘోర దాడుల జాబితాలో ఉన్నాయి. ఈ రెండు దాడులలోనే 360 మందికి పైగా మరణించారు. లష్కర్ ఉగ్రవాదులు 2000లో ఢిల్లీలోని ఎర్రకోటపై కూడా దాడి చేశారు. ఈ దాడుల వెనుక ఉన్న వ్యక్తిని అమెరికా, ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదిగా ప్రకటించాయి. హఫీజ్ సయీద్ తలపై 10 మిలియన్ల డాలర్ల నజరానా ఉంది. అయినప్పటికీ హఫీజ్ సయీద్ లాహోర్‌లో సాయుధుల మధ్య సౌకర్యవంతంగా జీవిస్తున్నాడు. పాక్ మంత్రి బిలావల్ భుట్టో గత నెలలో హఫీజ్ సయీద్ 'గృహ నిర్బంధంలో' ఉన్నాడని పేర్కొన్నాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో మురిద్‌కేలోని లష్కర్ ప్రధాన కార్యాలయాన్ని భారతదేశం ధ్వంసం చేసింది.

The Dirty 7 Pakistan Sheltering the World s Most Wanted Terrorists

2. మసూద్ అజహర్
జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అధిపతి మసూద్ అజహర్. ఈ సంస్థ కూడా పాకిస్తాన్‌లో ఉంది. పాక్ సైన్యం,'డీప్ స్టేట్' చేత రక్షించబడుతోంది. 59 మంది సైనికులను చంపి, డజన్ల కొద్దీ మందిని గాయపరచిన పుల్వామా , ఉరి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి అయిన మసూద్ అజహర్‌ను 2019లో ఐక్యరాజ్యసమితి 'ప్రపంచ ఉగ్రవాది'గా ప్రకటించింది. నేటికీ మసూద్ అజహర్ అధికారికంగా 'ఆచూకీ లేని వ్యక్తి'గా ఉన్నాడు. అయితే, నవంబర్‌లో మసూద్ అజహర్ పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఒక ఇస్లామిక్ సెమినరీలో ప్రసంగించి, భారత్‌పై మరిన్ని ఉగ్రదాడులకు పాల్పడతానని ప్రతిజ్ఞ చేశాడు. భారత ప్రభుత్వం మసూద్ అజహర్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. కానీ పాకిస్థాన్ మళ్లీ జాప్యం చేస్తూ అజహర్ ఆచూకీ గురించి తమకు సమాచారం లేదని పేర్కొనడం గమనార్హం. ఈ నెల ప్రారంభంలో బిలావల్ భుట్టో అజహర్ ఆఫ్ఘనిస్తాన్‌లో ఉండవచ్చునని పేర్కొన్నాడు. అయితే ఆపరేషన్ సింధూర్ సమయంలో క్షిపణి దాడుల ద్వారా నిలిపివేయబడిన ఉగ్రవాద శిబిరాలలో ఒకటి అయిన బహావల్‌పూర్‌లోని పాక్ నుంచి మసూద్ అజహర్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.

3. జాకియుర్ రెహమాన్ లఖ్వీ:
జాకియుర్ రెహమాన్ లఖ్వీ ఒక మతపరమైన ఇస్లామిక్ బోధకుడు. లష్కర్-ఇ-తొయిబాలో సీనియర్ నాయకుడు. వాస్తవానికి లఖ్వీ ఉగ్రవాద సంస్థ సైనిక అధిపతిగా, 26/11 ముంబై దాడికి సూత్రధారిగా గుర్తించబడ్డాడు. భారత్ ముంబై దాడిలో అతడి పాత్రకు సంబంధించి సాక్ష్యాలను అందించినప్పటికీ.. పాక్ అతడిని చాలా తక్కువ కాలం మాత్రమే జైలులో పెట్టి బెయిల్‌పై విడుదల చేసింది. 2020లో పాక్ గ్లోబల్ యాంటీ-టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్‌డాగ్ అయిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ 'గ్రే లిస్ట్'లో ఉన్నప్పుడు.. లఖ్వీ ఇస్లామాబాద్ నుంచి గణనీయమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొన్నాడు. కానీ అప్పటి నుండి అతను ఈ జాబితాలోని ఇతర ఉగ్రవాదుల మాదిరిగానే స్వేచ్ఛగా ఉన్నాడు. పంజాబ్ ప్రావిన్స్‌లో, ఇస్లామాబాద్‌లో కూడా లఖ్వీ చిరునామాలు నమోదు చేయబడ్డాయి. పాక్ సైన్యం, చైనా రక్షణలో అతను ఉన్నాడని నివేదికలు ఉన్నాయి. లఖ్వీని కీలక ఉగ్రవాదుల జాబితాలో చేర్చడానికి ఐక్యరాజ్యసమితి ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంది.

4.సయ్యద్ సలాహుద్దీన్
హుజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ అధిపతి సయ్యద్ సలాహుద్దీన్. కాశ్మీర్ లోయను భారత సైనికులకు స్మశానవాటికగా మారుస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్, భారత్‌కు చెందిన ఎన్ఐఏ చేత ఉగ్రవాదిగా ప్రకటించబడినప్పటికీ, సయ్యద్ సలహుద్దీన్ ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత వ్యతిరేక ర్యాలీలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇండియాకు వ్యతిరేకంగా జిహాద్‌కు పిలుపునిస్తున్నాడు.

5. దావూద్ ఇబ్రహీం

ప్రపంచంలోని అత్యంత మోస్ట్ వాంటెడ్ ఉగ్ర ఒకడైన దావూద్ ఇబ్రహీం ప్రముఖ అండర్ వరల్డ్ డాన్. సుప్రసిద్ధ డి-కంపెనీ నేర సిండికేట్ అధిపతి. దావూద్ హత్య, కిరాయి హత్య, దోపిడీ, డ్రగ్స్ అక్రమ రవాణా, ఉగ్రవాందం వంటి ఆరోపణలతో మోస్ట్ వాంటెడ్ గా పరిగణించబడ్డాడు. ఒక దశాబ్ధం క్రితం ముంబైలో జరిగిన బాంబు దాడులలో దావూద్ పాత్రకు 2003లో భారత్, అమెరికా చేత ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించబడ్డాడు. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 'మోస్ట్ వాంటెడ్' జాబితాలో కూడా దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దావూద్ తలపై 25 మిలియన్ల డాలర్ల నజరానా ఉంది. దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉన్నట్లు గుర్తించబడింది. అక్కడ దావూద్ ఇబ్రహీం పాక్ ప్రభుత్వం, దాని నిఘా విభాగం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI), దేశ సాయుధ దళాల రక్షణలో ఉన్నాడు.

6. ఇక్బాల్ భత్కల్:
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకులలో ఒకడు, బాంబర్.

7. రియాజ్ భత్కల్:
ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు, ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటాడు. ఇద్దరూ కరాచీలో ఉండి భారతదేశంలో స్లీపర్ సెల్‌లను నడుపుతున్నారు.

అనేక ఉగ్రవాద సమూహాలు, ఉగ్రవాదులు భారతదేశ భూభాగంపై దాడి చేయడానికి పాక్‌ను ఒక వేదికగా ఉపయోగిస్తున్నారు. ఇస్లామాబాద్ ఉగ్రదాడులలో తన పాత్రను హైలైట్ చేస్తూ భారతదేశం అంతర్జాతీయ సమాజంలో ఉన్నత స్థాయిలో ఈ విషయాన్ని ప్రస్తావించినప్పటికీ, ఈ పరిస్థితి కొనసాగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+