కోవిడ్ వ్యాప్తికి కారణమైన వ్యక్తికి అయిదేళ్ల జైలు శిక్ష - Newsreel
కోవిడ్ రూల్స్ను బేఖాతరు చేస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమైన ఓ వ్యక్తికి వియత్నాంలో అయిదేళ్ల జైలు శిక్ష విధించారు.
వియత్నాంకు చెందిన 'లీ వేన్ ట్రీ' వల్ల 8 మందికి కోవిడ్ సోకిందని, వారిలో ఒకరు మరణించారని కోర్టు నిర్ధరణకు వచ్చింది.
కొద్దినెలల కిందట వరకు కరోనావైరస్ వ్యాప్తిని వియత్నాం సమర్థంగా నియంత్రించింది. అయితే, ఈ ఏడాది జూన్ తరువాత డెల్టా వేరియంట్ అక్కడ విజృంభించింది.
వియత్నాంలో ఇప్పటివరకు 5,30,000 పాజిటివ్ కేసులు, 13,300 మరణాలు నమోదు కాగా అందులో అత్యధికం గత రెండు మూడు నెలల్లో నమోదైనవే.
ఎక్కువగా హో చి మిన్ సిటీలో కోవిడ్ తీవ్రత ఉంది.
28 ఏళ్ల 'లీ వేన్ ట్రీ' జులైలో హో చి మిన్ సిటీ నుంచి తన సొంతూరు 'కా మావూ'కు మోటార్సైకిల్ మీద వెళ్లారు.
అయితే, 'కా మావూ'లో హెల్త్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు తన ట్రావెల్ హిస్టరీ గురించి ఆయన అబద్ధం చెప్పారు. అంతేకాదు, ఐసోలేషన్ నియమాలు కూడా పాటించలేదు.
ఇతర ప్రాంతాల నుంచి కా మావూ వచ్చేవారు ఎవరైనా సరే కనీసం 21 రోజులు ఐసోలేషన్లో ఉండాలని అప్పటికి అక్కడ ఆదేశాలున్నాయి. కానీ, లీ వేన్ అది పాటించలేదు.
ఆ తరువాత లీ వేన్కి కరోనావైరస్ పాజిటివ్ నిర్ధరణ అయింది. ఆయన సందర్శించిన ఓ వెల్ఫేర్ సెంటర్ సిబ్బందికి, ఆయన కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది.
ఈ కేసు విచారించిన న్యాయస్థానం లీ వేన్కు అయిదేళ్ల జైలు శిక్షతో పాటు 880 డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 64 వేలు) జరిమానా విధించింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: దేశం పేరు మార్చిన తాలిబాన్లు, ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
- అఫ్గానిస్తాన్ మహిళల క్రికెట్ జట్లు సభ్యులు ఎక్కడ, తాలిబాన్ల భయంతో పారిపోయారా?
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
- 'పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్ నుంచి వెళ్లిపో' అంటూ కాబుల్లో పాక్ వ్యతిరేక ర్యాలీ.. గాల్లోకి తాలిబాన్ల కాల్పులు
- పంజ్షీర్లో పాకిస్తాన్ వెన్నుపోటు పొడుస్తోందా? ఇరాన్ వ్యాఖ్యలకు అర్థం ఏంటి?
- వర్షాల కోసం బాలికలను నగ్నంగా ఊరేగించిన గ్రామస్థులు
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- పిల్లలకు కరోనా వ్యాక్సీన్ అవసరమా, వైద్యులు ఏం చెబుతున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)