Israel-Hamas: ఇజ్రాయెల్ సైన్యం తప్పుతో ముగ్గురు బంధీల మృతి..
ఇజ్రాయెల్ సైనికులు తప్పుతో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలు మరణించారు. మరణానించిన వారికి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంతాపం తెలిపారు. అయితే, పాలస్తీనా గ్రూపు హమాస్ను నాశనం చేసేంత వరకు గాజాలో ఇజ్రాయెల్ తన దాడిని కొనసాగిస్తుందని ఆయన చెప్పినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. "ఇది (హత్యలు) నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇది దేశం హృదయాలను బద్దలు కొట్టింది" అని నెతన్యాహు అన్నారు. "మేము మా ఉనికి కోసం పోరాడుతున్నాము. మేము విజయం వరకు కొనసాగాలి" అన్నారు.
మృతి చెందిన వారిలో యోతమ్ హైమ్, సమర్ తలాల్కా, అలోన్ షమ్రిజ్ ఉన్నారు. వీరంతా 20 ఏళ్లలోపు వారే. ముగ్గురు తెల్ల జెండాను ఎగురవేస్తున్నారని, కాల్పులు జరిగినప్పుడు చొక్కా లేకుండా ఉన్నారని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ ఘటన షిజాయాలో చోటుచేసుకుందన్నారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్లోకి హమాస్ చేసిన దాడితో ఈ యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ హమాస్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించింది. గాజాపై విరుచుకు పడింది. ఈ దాడిలో 17,000 మందిని మరణించారు.

నవంబర్లో కతార్ మధ్యవర్తిత్వం వహించిన చర్చల తర్వాత కాల్పుల విరమణ సమయంలో పాలస్తీనా ఖైదీల కోసం హమాస్ 100 మందికి పైగా బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ గూఢచారిని ఇరాన్ ఉరి తీసింది. శనివారం ఈ విషయాన్ని ప్రభుత్వ వార్తా సంస్థ టెహ్రాన్లో ప్రకటించింది. ఆ గూఢచారికి మొస్సాద్తోపాటు పలు అంతర్జాతీయ నిఘా సంస్థలతో సంబంధాలున్నాయని వెల్లడించింది. బలూచిస్థాన్ ప్రావిన్సులోని జాహెదన్ జైలులో అతడిని ఉరి తీసినట్లు పేర్కొంది.
2022 ఏప్రిల్లో ముగ్గురు మొస్సాద్ గూఢచారులను ఇరాన్ అరెస్టు చేసింది. అందులో ఒకరిని తాజాగా ఉరి తీసింది. ఇజ్రాయెల్కు చెందిన మొస్సాద్ గూఢచారి సంస్థ అధిపతి డేవిడ్ బర్నియా శుక్రవారం అర్థరాత్రి యూరప్లో ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీని కలిసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది.ఇజ్రాయెల్ ప్రధాన నగరమైన టెల్ అవీవ్లో శుక్రవారం రాత్రి వందల మంది ఆందోళనకారులు ఆకస్మికంగా జాతీయ రహదారిని దిగ్బంధనం చేశారు. బందీలను విడిపించాలని కోరారు.
-
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
1970ల నాటి చీకటి రోజులు మళ్లీ: సంచలన హెచ్చరిక! -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
ఇరాన్ వార్ పై ప్రధాని సమీక్ష-చమురు, గ్యాస్, ఎరువులపై కీలక నిర్ణయాలు ?










Click it and Unblock the Notifications