200మిలియన్ డాలర్ల మోసం: ఇద్దరు ఇండియన్ అమెరికన్లకు జైలు
భారీ మొత్తంలో క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడిన కేసులో అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు జైలుపాలయ్యారు. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులకు సంబంధించి దాదాపు 200 మిలియన్ డాలర్ల మోసానికి .
వాషింగ్టన్: భారీ మొత్తంలో క్రెడిట్ కార్డుల మోసాలకు పాల్పడిన కేసులో అమెరికాలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు జైలుపాలయ్యారు. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులకు సంబంధించి దాదాపు 200 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడిన కేసులో విజయ్ వర్మ(49), తర్సీమ్ లాల్(78) అనే ఇద్దరు వ్యక్తులకు ఏడాదికి పైగా శిక్ష పడింది.

వీరిద్దరూ న్యూజెర్సీలో నగల దుకాణం యజమానులు. దోషులుగా తేలడంతో కోర్టు వారికి 14నెలల జైలు, 12 నెలల పాటు గృహనిర్బంధం విధించింది. అలాగే ఇద్దరికీ 5వేల డాలర్ల చొప్పున జరిమానా విధించారు.
అపరాధ రుసుము కింద 4,51,259 డాలర్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. 2013లో వర్మ, లాల్ కలిసి నకిలీ గుర్తింపులతో దాదాపు 7వేల క్రెడిట్ కార్డులు తీసుకుని 200 మిలియన్ డాలర్ల మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు రుజువయ్యాయి.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications