సంక్షోభంలో ఇరాన్.. భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచన
ఇరాన్ లో ప్రస్తుతం ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయులకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారతీయులు ఇరాన్ కు ప్రయాణాలు మానుకోవాలని సూచనలు చేసింది. తమ నుంచి మరోసారి ఆదేశాలు వచ్చేంత వరకూ అనవసర ప్రయాణాలు చేయోద్దని పేర్కొంది. అలాగే ఇరాన్ లో ఉన్న భారతీయులు, పీఐఓ లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆందోళనలు జరిగే చోటుకు వెళ్లొద్దని.. అలాగే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని భారత దౌత్య కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు అధికారిక ఛానెల్స్ ద్వారా ప్రసారమయ్యే అప్డేట్స్ ను ఫాలో కావాలని సూచనలు చేసింది.
ఇరాన్ లో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం తదితర కారణాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారతీయులు ఇరాన్ కు అనవసర ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అలాగే ఇరాన్ లోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. ఇరాన్ లో రెసిడెంట్ వీసాలతో ఉన్న భారతీయులు తక్షణమే భారత దౌత్య కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచనలు చేసింది. ఎప్పటికప్పుడు భారత దౌత్య కార్యాలయం నుంచి వచ్చే అప్డేట్స్ ను గమనించాలని స్పష్టం చేసింది.

ఇరాన్ లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. దాంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం సమస్యలు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో తొలుత నిరసనలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ప్రారంభం అయ్యాయి. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. అక్కడి నుంచి దేశంలోని ఇతర కీలక ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. ఈ ఉద్రిక్తతల్లో పలువురు మృతి చెందారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న భారతీయ పౌరులు, భారత సంతతికి చెందినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ ఈ అడ్వైజరీని జారీ చేసింది.












Click it and Unblock the Notifications