US bridge Collapse: అమెరికా బ్రిడ్జిని కూల్చేసిన నౌక నడిపింది మనోళ్లే-గవర్నర్ ప్రశంసలు..!
అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో 1.6 మైళ్ల పొడవైన వంతెనను సింగపూర్ కు చెందిన ఓ వాణిజ్య నౌక ఢీకొట్టడంతో అమాంతం క్షణాల్లోనే అది కుప్పకూలింది. దీని దృశ్యాలు కూడా బయటికి వచ్చాయి. దీంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఇందులో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. ఈ ఘటనలో భారతీయుల పాత్ర ఉన్నట్లు తేలింది.
NEW: At least 7 people are missing after cargo ship appears to lose power & slam into the support beam of the Francis Scott Key Bridge in Baltimore, Maryland.
— Collin Rugg (@CollinRugg) March 26, 2024
The ship was being piloted by a local pilot who specializes in moving in and out of the Port of Baltimore.
Two people… pic.twitter.com/fxdyEWSmUw
అమెరికాలోని బాల్టిమోర్ సిటీలో సింగపూర్ కు చెందిన ఓ కంటెయినర్ షిప్ ఢీకొట్టడంతో దాదాపు రెండున్నర కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో కేవలం 20 మంది మాత్రమే నీటిలో పడిపోయినట్లు నిర్దారణ అయింది. ఇంత పెద్ద వంతెన కూలిపోతే కేవలం 20 మంది మాత్రమే నదిలో పడిపోవడంపై చర్చ జరుగుతోంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులకు అసలు కారణం తెలిసింది.

Baltimore Bridge is 1.6 miles long,
— Science girl (@gunsnrosesgirl3) March 26, 2024
this is the moment it collapsed after a cargo ship struck it in the early hours of this morning
pic.twitter.com/eA6womQlcI
సింగపూర్ కు చెందిన ఈ కంటెయినర్ షిప్ ను నడుపుతోంది పూర్తిగా భారతీయులే. వీరు నాలుగు లైన్ల ఈ వంతెనకు సమీపంలోకి రాగానే ఇక ప్రమాదం తప్పదనే అంచనాకు వచ్చేశారు. అంతే ఎమర్జెన్సీ అలారం మోగించారు. దీంతో ఈ వంతెనపైకి వచ్చిన వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్లు ఇప్పుడు అధికారులు తేల్చారు. దీనిపై స్పందించిన మేరీల్యాండ్ గవర్నర్ ఆ భారతీయులు హీరోలు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. వారు సకాలంలో సైరన్ మోగించకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదంటున్నారు.
ఈ ఓడలో 22 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా భారతీయులే. డాలీ పేరు గల ఈ ఓడను నడుపుతున్న సినర్జీ మెరైన్ గ్రూప్ స్పందిస్తూ ఈ ప్రమాదంలో తమ నౌకలో అంతా సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. వాస్తవానికి ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ యొక్క పిల్లర్ ను ఢీకొనడానికి ముందు ఓడలో లైట్లు ఆరిపోతున్నట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది. అంతే కాదు దానిలో కొంత భాగం ఓడపైనే కూలిపోయింది కూడా. గంటకు తొమ్మిది మైళ్ళ వేగంతో కదులుతున్న ఈ ఓడ వంతెన స్తంభాన్ని ఢీకొనడానికి కొన్ని క్షణాల ముందు మేడే కాల్ని జారీ చేసిందని, దీని వల్ల రోడ్డు ట్రాఫిక్ను నిలిపివేసి ప్రాణాలు రక్షించామని గవర్నర్ తెలిపారు.
-
బరువు తగ్గాలంటే చనా వెజ్ సలాడ్ ఇలా ట్రై చెయ్యండి! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications