ఐసిస్ ఉగ్రవాదులు భార్యలనే వాడుకుంటున్నారు
సిరియా: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) కార్యకలాపాల్లో ఉగ్రవాదుల భార్యలు కీలకపాత్ర పోషిస్తున్నారా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాద రహస్యాలను, సమాచారాన్ని ఒకరి నుంచి మరొకరికి అందించేందుకు ఐసిస్ ఉగ్రవాదులు తమ భార్యలను ఉపయోగించుకుంటున్నారు.
ఎలక్ట్రానికి మార్గాల ద్వారా సమాచారం పంపితే అమెరికా నిఘా వర్గాలు పసిగడుతున్నాయని ఐసిస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తమ భార్యలచే సమాచారం పంప్తున్నారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ సహా మిగతా తీవ్రవాద నాయకులు అందరూ ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. కీలక సమాచారం చేరవేయడంతో పాటు సేకరించడంలోను భార్యలను ఉపయోగించుకుంటున్నారు.

ఐసిస్ పెద్దలను కలవాలనుకునే వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తోందట. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు సహా ఇతర ఏ ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకు రావొద్దని చెబుతోంది. మే 16 దాడిలో ఉగ్రవాద నేత అబూ సయ్యఫ్ హతమయ్యాడు.
అతడి భార్య ఉమ్ సయ్యఫ్ ఇచ్చిన సమాచారంతో ఇతర ఉగ్రవాద నేతల ఆచూకీ లభించింది. సంకీర్ణ దళాల దాడిలో దొరికిన ల్యాప్ టాప్, సెల్ ఫోన్ల ద్వారా కూడా విలువైన సమాచారం లభించినట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications