ఐఏఎస్ మృతి.. శ్వాస సమస్యలతో కన్నుమూత.. శోకసంద్రంలో ఫ్యామిలీ..
కరోనా కలవర పెడుతోంది. భయాందోళనకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ ఎవరినీ వదలడం లేదు. కరోనా కాటుకు ప్రతీ ఒక్కరు బలి అవుతూనే ఉన్నారు. కరోనాకు వ్యాక్సినే శ్రీరామ రక్ష అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ అదీ కూడా 6 నెలలే పనిచేస్తుందనే వాదన ఉంది. అయితే ఇవాళ ఓ ఐఏఎస్ చనిపోయారు. కరోనా అని స్పష్టం చేయలేదు కానీ.. శ్వాస సమస్యలు అని మాత్రం తెలుస్తోంది. బ్రీత్ ఇష్యూ అంటే కరోనానే అని అందరికీ తెలిసిన విషయమే.
రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ అంజయ్య కన్నుమూశారు. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో అతనిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఆయన చనిపోయారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారని తెలుస్తోంది. కానీ కరోనా అని మాత్రం ఫ్యామిలీ మెంబర్స్, ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేయలేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.. మంచి పేరుంది. పాలనాపరమైన సంస్కరణలను తీసుకొచ్చారు. కృష్ణ భాస్కర్ వెంట అంజయ్య ఉన్నారు. కలిసి పనిచేశారు. ఇంతలో అంజయ్య మృతి కలవరానికి గురిచేసింది. అధికారులు/ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు.