ఐఏఎస్ మృతి.. శ్వాస సమస్యలతో కన్నుమూత.. శోకసంద్రంలో ఫ్యామిలీ..
కరోనా కలవర పెడుతోంది. భయాందోళనకు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ ఎవరినీ వదలడం లేదు. కరోనా కాటుకు ప్రతీ ఒక్కరు బలి అవుతూనే ఉన్నారు. కరోనాకు వ్యాక్సినే శ్రీరామ రక్ష అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ అదీ కూడా 6 నెలలే పనిచేస్తుందనే వాదన ఉంది. అయితే ఇవాళ ఓ ఐఏఎస్ చనిపోయారు. కరోనా అని స్పష్టం చేయలేదు కానీ.. శ్వాస సమస్యలు అని మాత్రం తెలుస్తోంది. బ్రీత్ ఇష్యూ అంటే కరోనానే అని అందరికీ తెలిసిన విషయమే.
రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ అంజయ్య కన్నుమూశారు. ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దీంతో అతనిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఆయన చనిపోయారు. ఆయన అనారోగ్యంతో చనిపోయారని తెలుస్తోంది. కానీ కరోనా అని మాత్రం ఫ్యామిలీ మెంబర్స్, ఆస్పత్రి యాజమాన్యం స్పష్టంచేయలేదు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.. మంచి పేరుంది. పాలనాపరమైన సంస్కరణలను తీసుకొచ్చారు. కృష్ణ భాస్కర్ వెంట అంజయ్య ఉన్నారు. కలిసి పనిచేశారు. ఇంతలో అంజయ్య మృతి కలవరానికి గురిచేసింది. అధికారులు/ సిబ్బంది శోకసంద్రంలో మునిగిపోయారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం!












Click it and Unblock the Notifications