చర్లపల్లి జైలులో భానుకిరణ్ వద్ద మందు బాటిల్స్ లభ్యం
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి కోర్టుకు చెందిన 120 మంది జీవిత ఖైదులను చర్లపల్లి నుంచి చంచల్గూడకు తరలించున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలను నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఖైదీల వద్ద మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. జైల్లోని మానస బ్యారక్లో 10 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాటిళ్లను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.

ఈ విషయాన్ని జైలు అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే అతనికి మద్యం బాటిళ్లు ఎవరు సరఫరా చేశారన్న విషయంపై విచారణ జరుగుతోంది. జైలులో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, 120 మంది ఖైదీలను చర్లపల్లి నుంచి చంచల్గూడ జైలుకు తరలించనున్నట్లు జైళ్లశాఖ డీజీ వినయ్కుమార్ సింగ్ ఆదేశాలు జారీచేశారు. చంచల్గూడ్లో నూతన పరిశ్రమ, పెట్రోల్ బంక్లను ప్రారంభిస్తున్న దృష్ట్యా ఖైదీల తరలింపును చేపట్టినట్లు ఆయన తెలిపారు. వారం లేదా పదిరోజుల్లో ఖైదీలను చంచల్గూడకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications