బాబుకు రివర్స్: నాడు వైస్రాయ్ హోటల్.. నేడు ఎర్రబెల్లి ఝలక్?
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చీలిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 15 మంది సైకిల్ గుర్తు పైన గెలిస్తే... అందులో 10 మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. 2/3 వంతు ఎమ్మెల్యేలు తమకు ఉన్నందున తమనే అసలు టిడిపిగా గుర్తించాలని, తామంతా తెరాసలో విలీనమవుతున్నట్లు ఎర్రబెల్లి లేఖ రాశారు.
ఎర్రబెల్లి దయాకర రావు లేఖ రాయడంపై తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి తదితరులు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రెండు దశాబ్దాల క్రితం వైస్రాయ్ హోటల్లో జరిగిన సంఘటనను గుర్తుకు చేస్తున్నారు. నాడు జరిగిందే నేడు జరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రెండు దశాబ్దాల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. చంద్రబాబు టిడిపిని చీల్చి, ఎక్కువ మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకొని ముఖ్యమంత్రి అయ్యారని కాంగ్రెస్, వైసిపి, ఇతర విపక్షాలు విమర్శిస్తుంటాయి. ఇప్పుడు ఎర్రబెల్లి అదే చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది తెలంగాణలో గెలిచారు. ఈ ఇరవై నెలల కాలంలో పదిమంది ఎమ్మెల్యేలు కారు ఎక్కారు. మరో అయిదుగురు మిగిలి ఉన్నారు. వారిలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తనకు టిడిపితో సంబంధం లేదని చెప్పారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications