దండకారణ్యంలో తుపాకుల మోత; 13 మంది మావోయిస్టుల ఏరివేత!!
దండకారణ్యం తుపాకుల మోతతో హోరెత్తింది. మావోయిస్టులను టార్గెట్ చేసి ఏరివేత చేపట్టిన భద్రతా బలగాలు నిన్న ఉదయం నుండి సాగించిన ఎన్కౌంటర్ లో మొత్తం 13 మందిని మట్టుబెట్టాయి. ఛత్తీస్ గడ్ లోని బస్తర్ రీజియన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. బీజాపూర్ జిల్లా కొర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ప్రారంభం అయిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు సాగింది.
బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోలకు భద్రతా బలగాలకు భీకర పోరు
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ అని చెప్పాలి.పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందటంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు డీఆర్జీ బృందాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్ గడ్ ఆర్మ్డ్ ఫోర్స్ భద్రతా బలగాలు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

10 గంటలపాటు హోరాహోరీగా..
అక్కడ మావోయిస్టులతో తారసపడటంతో మావోలు భద్రతా బలగాలపై కాల్పులు జరిపాయి. దీంతో భద్రాతా బలగాలు జరిపిన ఎదురు కాల్పులలో మొత్తం 13 మంది నక్సలైట్లు నేలకొరిగారు. మొత్తం 10 గంటలపాటు హోరాహోరీగా సాగిన భీకర పోరాటంలో 13 మందిని హతమార్చటంతో పాటు, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి ఇన్సాన్, ఎల్ ఎం జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కొనసాగుతున్న కూంబింగ్
ఇంకా దండకారణ్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికి 13 మంది మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. తాజా ఎన్కౌంటర్ లో డీవీసీ మెంబర్ క్రాంతి ముచతో పాటుమరో కీలక సభ్యుడు పాపారావు మృతి చెందినట్టు ప్రాధమిక సమాచారం. అయితే మృతి చెందిన వారే కాకుండా భారీ సంఖ్యలో మావోయిస్టులు గాయాల పాలైనట్టు సమాచారం.ఇక వారి కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.
ఇప్పటివరకు బస్తర్ రీజియన్ లో ఇటీవల భారీ సంఖ్యలో మావోలు మృతి
కాగా, గత నెల 27న ఇదే బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇక నిన్న 8 మంది మృతి చెందినట్టు ప్రకటించగా నేడు మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా ఇప్పటివరకు బస్తర్ రీజియన్ లో జరిగిన యాంటీ నక్సల్ ఆపరేషన్ లో మొత్తం 45 మంది మావోయిస్టులు మృతి చెందారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications