Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దండకారణ్యంలో తుపాకుల మోత; 13 మంది మావోయిస్టుల ఏరివేత!!

దండకారణ్యం తుపాకుల మోతతో హోరెత్తింది. మావోయిస్టులను టార్గెట్ చేసి ఏరివేత చేపట్టిన భద్రతా బలగాలు నిన్న ఉదయం నుండి సాగించిన ఎన్కౌంటర్ లో మొత్తం 13 మందిని మట్టుబెట్టాయి. ఛత్తీస్ గడ్ లోని బస్తర్ రీజియన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతుల సంఖ్య 13కు పెరిగింది. బీజాపూర్ జిల్లా కొర్చోలి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ప్రారంభం అయిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు సాగింది.

బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోలకు భద్రతా బలగాలకు భీకర పోరు
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ అని చెప్పాలి.పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహిస్తున్నట్టు సమాచారం అందటంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు డీఆర్జీ బృందాలు, సీఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్ గడ్ ఆర్మ్డ్ ఫోర్స్ భద్రతా బలగాలు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

13 Maoists killed in massive encounter in bijapur District combing continues

10 గంటలపాటు హోరాహోరీగా..
అక్కడ మావోయిస్టులతో తారసపడటంతో మావోలు భద్రతా బలగాలపై కాల్పులు జరిపాయి. దీంతో భద్రాతా బలగాలు జరిపిన ఎదురు కాల్పులలో మొత్తం 13 మంది నక్సలైట్లు నేలకొరిగారు. మొత్తం 10 గంటలపాటు హోరాహోరీగా సాగిన భీకర పోరాటంలో 13 మందిని హతమార్చటంతో పాటు, భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి ఇన్సాన్, ఎల్ ఎం జి వంటి ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కొనసాగుతున్న కూంబింగ్
ఇంకా దండకారణ్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికి 13 మంది మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. తాజా ఎన్కౌంటర్ లో డీవీసీ మెంబర్ క్రాంతి ముచతో పాటుమరో కీలక సభ్యుడు పాపారావు మృతి చెందినట్టు ప్రాధమిక సమాచారం. అయితే మృతి చెందిన వారే కాకుండా భారీ సంఖ్యలో మావోయిస్టులు గాయాల పాలైనట్టు సమాచారం.ఇక వారి కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది.

ఇప్పటివరకు బస్తర్ రీజియన్ లో ఇటీవల భారీ సంఖ్యలో మావోలు మృతి
కాగా, గత నెల 27న ఇదే బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇక నిన్న 8 మంది మృతి చెందినట్టు ప్రకటించగా నేడు మృతుల సంఖ్య 13కు చేరింది. కాగా ఇప్పటివరకు బస్తర్ రీజియన్ లో జరిగిన యాంటీ నక్సల్ ఆపరేషన్ లో మొత్తం 45 మంది మావోయిస్టులు మృతి చెందారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+