దుబాయ్ పంపేందుకు వెళ్తూ పైలోకాలకు (పిక్చర్స్)
హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డులో ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించిన సంఘటన బుధవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు.
నిజామాబాద్ జిల్లా హబీబ్ నగర్కు చెందిన ఇస్మాయిల్, సోదరుడు రజాక్ కుటుంబాన్ని దుబాయ్ పంపించేందుకు శంషాబాద్ పంపించేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వాహనంలో బయలుదేరారు.
మేడ్చల్ మండలం సుతారిగూడ ఔటర్ రింగ్ రోడ్డు రహదారి వద్దకు వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలు అవుతోంది.

ఔటర్ రింగ్ రోడ్డు
ఆ సమయంలో వాహనంలో మొత్తం 11 మంది ఉన్నారు. అదే సమయంలో ఔటర్ రహదారి టోల్ గేటుకు అర కిలోమీటరు దూరంలో రంగారెడ్డి జిల్లా మణికొండకు చెందిన వెంకటేష్ అనే వ్యాపారి తన కారులో పటాన్ చెరు నుండి మేడ్చల్ వస్తున్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు
కారు టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి డివైడర్ను ఢాకొట్టింది. దీంతో అవతలి వైపు వస్తున్న క్వాలిస్ వాహనాన్ని ఢీకొట్టి పక్కకు పడిపోయింది.

ఔటర్ రింగ్ రోడ్డు
డ్రైవర్ వెంకటేష్ తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఇంతలో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. అవతలి వాహనంలో ప్రయాణిస్తున్న ఇస్మాయిల్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు.

ఔటర్ రింగ్ రోడ్డు
రజాక్ భార్య, పిల్లలు, ఇతరులు ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెంది ఉండవచ్చునను తొలుత వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందారు.

ఔటర్ రింగ్ రోడ్డు
రజాక్ భార్య, పిల్లలు, ఇతరులు ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెంది ఉండవచ్చునను తొలుత వార్తలు వచ్చాయి. ఈ ఘటనలో ఒక్కరు మృతి చెందారు.












Click it and Unblock the Notifications