నిర్లక్ష్యం: స్కూల్ సంప్లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి
భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో మంగళవారం దారుణం జరిగింది. బాలల దినోత్సవం రోజునే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ సంఘటన మల్కాజిగిరిలోని బచ్పన్ స్కూలులో చోటు చేసుకుంది.
హైదరాబాద్: భాగ్యనగరంలోని మల్కాజిగిరిలో మంగళవారం దారుణం జరిగింది. బాలల దినోత్సవం రోజునే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యానికి ఓ చిన్నారి మృతి చెందాడు.
ఈ సంఘటన మల్కాజిగిరిలోని బచ్పన్ స్కూలులో చోటు చేసుకుంది. రక్షిత్ అనే రెండున్నరేళ్ల బాలుడు పాఠశాలలో ఉన్న సంప్లో పడి మృతి చెందాడు.
స్కూల్ ఆవరణలోనే సంప్ ఉంది. కానీ దానికి మూతపెట్టి లేదు. దీంతో ఆ బాలుడు అందులో పడి చనిపోయాడు. దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
English summary
Two and Half year old boy falls into sump dies in Hyderabad on Tuesday.