నిర్బంధించి బాలికపై అఘాయిత్యం: తాగిన మత్తులో..
హైదరాబాద్: తాగిన మత్తులో ఓ కామాంధుడు మూడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాదులోని రామచంద్రాపురంలో ఈ ఘటన జరిగింది. అనుమానితుడు పి. శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు.
బాధితురాలిని నిలోఫర్ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ప్రాణాలకు ముప్పు లేదని చెబుతున్నారు. బాలిక తన తల్లిదండ్రులతో మార్కెట్కు వెళ్లింది. తల్లిదండ్రులు సరుకుల కొనుగోలులో మునిగి ఉండగా, బాలిక తప్పిపోయింది.

ఓ తాగుబోతు బాలికను నిర్బంధించి, పక్కన ఉన్న పొదల్లోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. మార్కెట్లో కూతురి కోసం గాలించారు. కానీ వారి శ్రమ ఫలించలేదు. వారు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాత్రి 11 గంటల ప్రాంతంలో రక్తంతో తడిసిన దుస్తుల్లో ఏడుస్తున్న బాలిక బిహెచ్ఈఎల్ ఆర్టీసి ఉద్యోగులకు కనిపించింది. ఆమె పక్కన శ్రీనివాస్ కూడా కనిపించాడు. ఆర్టీసి ఉద్యోగులను చూడగానే అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
-
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications