బలవంతంగా యువతుల్ని వ్యభిచారంలోకి: 41మందిలో 18 మంది స్త్రీలే
హైదరాబాద్: అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ట్రాఫికర్స్ను తెలంగాణ సిఐడి పోలీసులు గురువారం నాడు న్యాయస్థానంలో హాజరుపరిచారు. మొత్తం 41 మంది ట్రాఫికర్స్ను అరెస్టు చేయగా, అందులో 18 మంది మహిళా ట్రాఫికర్స్ ఉన్నారు.
ఇటీవల వ్యభిచార గృహం నుంచి తప్పించుకొని వచ్చిన ఓ యువతి ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నాలుగు రోజుల పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

150 మందితో కూడిన సిఐడి బృందం నాలుగు రోజుల పాటు దాడులు నిర్వహించింది. ఈ దాడులలో 18 మంది మహిళలు సహా 41 మంది ట్రాఫికర్స్ను అరెస్టు చేశారు. 39 మందిని యువతులను రక్షించారు.
అందులో 31 మంది యువతులు, 8 మంది పిల్లలు ఉన్నారు. ఉద్యోగాల పేరుతో యువతులను, మహిళలను మహారాష్ట్రకు తీసుకెళ్తున్న ట్రాఫికర్స్.. వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్నారు. తెలంగాణ సిఐడి కాపాడిన వారిలో 22మంది తెలంగాణ యువతులు, 7గురు చిన్నారులు ఉన్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications