పరస్పరం దాడులు: హైదరాబాద్లో అశోక్ బాబుపై కేసు నమోదు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబుపై హైదరాబాద్లో కేసు నమోదైంది. గన్ఫౌండ్రిలోని ఏపీఎన్జీవోల కార్యాలయంలో ఆదివారం చోటుచేసుకున్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో అశోక్బాబుతో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డిపై అబిడ్స్ పోలీసులు ఐపీసీ 323, 506, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వీరితోపాటు బీటీఎన్జీవో అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ సహా ఇతరులపైనా ఐపీసీ 523, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆదివారం ఏపీ ఎన్జీవోల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఏపీఎన్జీవో, బీటీఎన్జీవో నేతలు పరస్పరం భౌతిక దాడులకు పాల్పడ్డారు.
ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదంతో పాటు, తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొంతమంది అశోక్బాబు, ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎన్ చంద్రశేఖర్రెడ్డి తదితరులపై చేయి చేసుకున్నారు.

ఈ ఘర్షణలో హోంలోని ఫర్నీచర్, సీసీ కెమెరాలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. అక్కడికి చేరుకున్న ఆబిడ్స్ పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి నేతలను బయటకు పంపించారు. అనంతరం అబిడ్స్ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో వారిపై కేసులు నమోదయ్యాయి.
కాగా, గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీని విభజించాలని కోరుతున్నప్పటికీ అశోక్బాబు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాడని భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ ఆరోపించారు. సొసైటీ పేరుతో ఉద్యోగుల నుంచి రూ.34 కోట్లు వసూలు చేశారని, అందులో రూ.18 కోట్లకు అభివృద్ధి పేరిట తప్పుడు లెక్కలు చూపించారని చెప్పారు. అవకతవకలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే తమపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని అశోక్ బాబు ఆరోపించారు. సమస్యను సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలే తప్ప దాడులు చేయడం సరికాదని అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications